మోడీకి ఆధ్యాత్మిక గురువునంటూ వీఐపీ సౌకర్యాలు పొందుతున్నాడు: చివరకు అరెస్ట్
న్యూఢిల్లీ: తాను ప్రధానమంత్రికి ఆధ్యాత్మిక గురువునంటూ వివిధ ప్రాంతాల్లో సంచరిస్తున్న ఓ వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. పుల్కిత్ మహారాజ్ అలియాస్ పుల్కిత్ మిశ్రా అనే వ్యక్తి.. తాను వెళ్లిన ప్రతి రాష్ట్రంలో వ్యక్తిగత లబ్ధి కోసం తాను నరేంద్ర మోడీకి ఆధ్యాత్మిక గురువునని చెప్పుకుంటున్నాడని పోలీసులు తెలిపారు.
ఈ క్రమంలో వీఐపీ ప్రొటోకాల్ పొందడమే కాకుండా అనేక వెసులుబాట్లు పొందినట్లు గుర్తించామని చెప్పారు. అయితే, ప్రధాన మంత్రికి, పుల్కిత్కు ఎలాంటి సంబంధం లేదని పీఎంఓ నుంచి స్పష్టత రావడంతో రంగంలోకి దిగి అతడ్ని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

తాను నివసించేందుకు భద్రతా దళంతో కూడిన ఒక నివాసాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ఉత్తరప్రదేశ్లోని సీతాపూర్ జిల్లా కలెక్టర్కు పుల్కిత్ లేఖ రాశారు. ఇందులో ఆయన కేంద్ర సాంస్కృతిక శాఖ కార్యదర్శినని పరిచయం చేసుకున్నాడు.
అంతేగాక, మోడీతోపాటు అనేకమంది ప్రముఖులతో ఫొటోలు దిగినట్లు నకిలీ చిత్రాలు సృష్టించాడు. తనను రాష్ట్రపతి సిఫార్సు చేశారని, వీఐపీ వైద్యం అందించాలని కోరుతూ ఓ వైద్యశాలను సంప్రదించినట్లు పోలీసులు తెలిపారు.
-
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!!












Click it and Unblock the Notifications