రైతులకు మద్దతిస్తున్న సెలబ్రిటీలపై కేంద్రం చర్యలు- గ్రెటా థన్బర్గ్పై ఢిల్లీ పోలీసుల కేసు
కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో మూడు నెలలుగా రైతులు ఆందోళనలు చేస్తున్నారు. రిపబ్లిక్ డే రోజు ఎర్రకోటపై రైతులు జెండాలను కూడా ఎగరేశారు. అనంతరం నిరసనల తీవ్రత మరింత పెరిగింది. వీరికి అంతర్జాతీయంగా పలువురు సెలబ్రిటీలు కూడా మద్దతు ప్రకటిస్తున్నారు. దీనిపై దేశంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల నిరసనకు మద్దతు తెలుపుతున్న అంతర్జాతీయ సెలబ్రిటీల విషయంలో ఆగ్రహంగా ఉన్న కేంద్రం తాజాగా చర్యలకు దిగింది. రైతుల నిరసనకు మద్దతిస్తూ ట్వీట్ చేసిన వాతావరణ మార్పుల ఉద్యమకారిణి గ్రెట్ ధన్బర్గ్పై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమె చేసిన ట్వీట్ నేరపూరిత కుట్ర, మతాల పేరుతో విద్వేషం పెంచడం కిందకు వస్తుందని ఆరోపిస్తూ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీంతో ఈ వ్యవహారం మరింత వేడెక్కింది.

తాజాగా రైతుల ఆందోళనకు మద్దతునిస్తూ పాప్ స్టార్ రిహన్నా ట్వీట్ చేసిన కాసేపటికే గ్రెటా ధన్బర్గ్ కూడా ట్వీట్ చేశారు. దీంతో ప్రస్తుతం వీరి ట్వీట్లను నిశితంగా పరిశీలిస్తున్న కేంద్రం.. న్యాయసలహా ప్రకారం ఒక్కొక్కరిపై ఒక్కో విధంగా కేసులు నమోదు చేసేందుకు సిద్దమవుతోంది. ఇందులో భాగంగా ముందుగా గ్రెటా ధన్బర్గ్పై ఢిల్లీ పోలీసులు కేసు పెట్టారు. ఇందులో నేరపూరిత కుట్ర ఆరోపణలు చేయడంతో ఈ వ్యవహారం ఎక్కడికి చేరుతుందో చూడాల్సి ఉంది.
-
దివ్యాంగుల ప్రతిభకు పట్టం: రూ. 5 లక్షలు గెలుచుకునే ఛాన్స్.. అప్లై చేసుకోండిలా! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..!












Click it and Unblock the Notifications