దారుణం: యజమానురాలిని హత్య చేసిన పనిమనిషి
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో మరో దారుణం జరిగింది. ఓ ఇంట్లో పని మనిషిగా ఉన్న యువకుడు తన యజమానురాలైన 81ఏళ్ల మహిళను గొంతునులిమి హత్య చేసింది. ఈ ఘటన విలాసంతమైన గ్రేటర్ కైలాష్-11 ప్రాంతంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. రేఖా దుగ్గల్ అనే మహిళ(81)ను ఆమెకు సహాయకుడిగా ఉన్న పని మనిషి నీరజ్ సాకి(21) గొంతునులిమి హత్య చేశాడు. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని దగ్ధం చేసేందుకు ప్రయత్నంచాడు.
కాగా, అంతకుముదు చుట్టుపక్కల వారికి రేఖే దుగ్గల్ కనిపించడం లేదని చెప్పాడు. దీంతో వారు రేఖ కూతురు, అల్లుడుకు సమాచారం అందించారు. కాగా, బాధితురాలి మృతదేహం ఆ ఇంటిలోని రెండో అంతస్తు పడక గదిలో ఓ మూలన పడివుంది.
ఆమె మృతదేహం పాక్షికంగా కాలిపోయి ఉంది. దీంతో ఆ మృతదేహానికి పోస్టు మార్టం నిర్వహించారు. పోస్టుమార్టం నివేదికలో గొంతునులుమి హత్య చేసినట్లు తేలింది. విచారణ జరిపిన పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేశారు. 2005లో తన భర్త చనిపోవడంతో ఆ వృద్ధురాలు ఇద్దరు సహాయకులతోపాటు ఆ ఇంట్లో ఉంటోంది.