జగన్ ప్రమాణ స్వీకారోత్సవానికి స్టాలిన్... దుర్గమ్మను దర్శించుకోనున్న స్టాలిన్,జగన్,కేసీఆర్
మే 30 విజయవాడలో జరగనున్న ఏపీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి తమిళనాడు నేతలు హజరుకానున్నారు. ఈనేపథ్యంలోనే డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ హజరుకానుట్టు తెలిపారు. కాగా ప్రమాణ స్వికారానికి హజరు కావాల్సిందిగా జగన్ నేరుగా స్టాలిన్కు ఫోన్ చేసి అహ్వానించినట్టు స్టాలిన్ తెలిపారు. ఈనేపథ్యంలోనే అయన హజరు కానున్నట్టు తెలిపారు.
ఇక స్టాలిన్తో పాటు , జగన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్లు విజయవాడలోని కనకదుర్గ అమ్మవారిని దర్శించుకోనున్నట్టు అలయ అధికారులు ప్రకటించారు. దీంతో దుర్గగుడి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రకటించారు.మరోవైపు గవర్నర్ సైతం సాయంత్రం అమ్మవారిని దర్శించుకోనుట్టు తెలిపారు.

ఇక తమిళనాడులో కాంగ్రెస్ డీఎంకే కూటమీ ఎంపీ ఎన్నికల్లో మెజారీటీ సీట్లు సాధించిన విషయం తెలిసిందే..ఈనేపథ్యంలోనే డీఎంకే ,కాంగ్రెస్ పార్టీల అలయెన్స్ మొత్తం 39 సీట్లకు గాను డీఎంకే 23 సీట్లు, కాంగ్రెస్ పార్టీ 8 పార్లమెంట్ స్థానాలకు కైవసం చేసుకుంది.అయితే బీజేపీ పోత్తుపెట్టుకున్న అధికార అన్నా డిఎంకే ఒక్క స్థానంలో విజయం సాధించింది. దీంతో బీజేపీ తమిళనాడులో ఖాత తెరవలేకపోయింది.
మరోవైపు బీజేపీ ఖాత తెరవని రాష్ట్ర్రాలు పరీశీలిస్తే అటు తమిళనాడుతోపాటు ,ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్ర్రాలు ఉన్నాయి. కాగా తెలంగాణలో అనుహ్యంగా నాలుగు స్థానాలు సాధించింది.












Click it and Unblock the Notifications