పాక్ అసత్య ప్రచారం, ఆ వీడియోలను షేర్ చేయవద్దు : ఇండియన్ ఆర్మీ
న్యూఢిల్లీ : పాక్ పై భారత్ సర్జికల్ దాడి నేపథ్యంలో.. భారత్ స్థైర్యాన్ని దెబ్బతీసేందుకు మీడియాను ఓ పావులా వాడుకుంటోంది పాకిస్తాన్. ఈ క్రమంలోనే భారత సైనికులు మరణించినట్టుగా వార్తలు ప్రచారం చేస్తున్నాయి పాకిస్తాన్ టెలివిజన్ చానెళ్లు. ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియాలోను చక్కర్లు కొడుతుండడంతో అలాంటి వాటిని షేర్ చేయొద్దని సైన్యం హెచ్చరిస్తోంది.
పాక్ దుష్ప్రచారాన్ని బూటకమని తేల్చేసిన ఇండియన్ ఆర్మీ.. సోషల్ మీడియాలో భారత సైనికులు చనిపోయినట్టున్న వీడియో క్లిప్పింగులను, ఫోటోలను షేర్ చేయొద్దని సూచిస్తోంది. మీడియాలో కూడా అలాంటి ప్రసారాలకు తావివ్వవద్దని చెబుతోంది భారత సైన్యం. భారత సైన్యం సర్జికల్ దాడితో బిగ్ షాక్ లో ఉన్న పాక్, భారత్ చర్యలను తిప్పికొట్టేందుకు ఇలాంటి కుయుక్తులకు పాల్పడుతోంది.













Click it and Unblock the Notifications