నాల్గవదశ పోలింగ్ తో ఎస్పీకి డబుల్ సెంచరీ సీట్లు; అమిత్ షా వ్యాఖ్యలపైనా అఖిలేష్ యాదవ్ వ్యంగ్యాస్త్రాలు
ఉత్తరప్రదేశ్ నాలుగో దశ ఎన్నికల పోలింగ్ ముగిసింది. సమాజ్వాదీ పార్టీ నేతృత్వంలోని కూటమి డబుల్ సెంచరీ సీట్లను సాధిస్తుందని అఖిలేష్ యాదవ్ బుధవారం మాట్లాడుతూ ధీమా వ్యక్తం చేశారు. సమాజ్వాదీ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని అఖిలేష్ యాదవ్ ప్రజలను కోరారు. నాల్గవ దశ పోలింగ్ తమకు డబుల్ సెంచరీ సీట్లను పూర్తి చేస్తుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పుడు సమాజ్ వాదీ పార్టీ నేతృత్వంలోని కూటమికి చారిత్రాత్మక విజయాన్ని అందించడం ప్రజల బాధ్యత అని అఖిలేష్ యాదవ్ అన్నారు.
12వ తరగతి ఉత్తీర్ణులయ్యాక ఇంటర్లో ప్రవేశం పొందే వారికి ల్యాప్టాప్లు అందజేస్తామని అమిత్ షా నివేదించిన హామీపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై కూడా ఆయన మండిపడ్డారు. ఇంటర్ అనేది ఇంటర్మీడియట్ యొక్క సంక్షిప్త రూపం అని, అది 11 మరియు 12 తరగతులను సూచిస్తుందని పేర్కొన్నారు. ల్యాప్టాప్ల పంపిణీపై ప్రకటన చేసిన బీజేపీ నాయకుడు ఉన్నాడు. అది విన్న వారెవరికైనా నవ్వు ఆగదని హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ఎద్దేవా చేశారు.
12వ తరగతి తర్వాత ఇంటర్లో అడ్మిషన్ తీసుకున్న వారికి ల్యాప్టాప్లు అందజేస్తామని తెలిపారు. ఇంకా నయం ఇంటర్ తర్వాత 10వ తరగతి చదువుతున్న వారికి ల్యాప్టాప్ వస్తుందని, లేకుంటే ప్రజలు ఇబ్బంది పడతారని ఆయన చెప్పలేదు అని అఖిలేష్ యాదవ్ ఎన్నికల సమావేశంలో అమిత్ షా తప్పుగా చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. బిజెపి నేతలకు తాను హిందీ నేర్పించాలి అనుకుంటున్నా అని మాట్లాడిన అఖిలేష్ యాదవ్ కాకా అంటే కాలా కానూన్ నల్ల వ్యవసాయ చట్టాలు అని, బాబా అంటే యోగి ఆదిత్యనాథ్ అని పేర్కొన్నారు.
గతేడాది అక్టోబర్లో లఖింపూర్ ఖేరీ జిల్లాలో జరిగిన హింసాకాండను ప్రస్తావిస్తూ, ఒక మంత్రి కుమారుడు రైతులను చంపాడని, ప్రభుత్వం మొదట్లో ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీల ఒత్తిడి తర్వాతే చర్యలు ప్రారంభించారని గుర్తు చేశారు. ఇదే సమయంలో మంత్రి కుమారుడికి కోర్టు నుంచి బెయిల్ వచ్చింది కానీ ప్రజాకోర్టు నుంచి కాదు అని పేర్కొన్నారు. ప్రజలు బీజేపీ అభ్యర్థులకు డిపాజిట్లు గల్లంతు చేస్తారు అని అఖిలేష్ యాదవ్ అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు ఉత్తరప్రదేశ్ రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, సమ్మిళిత సంస్కృతిని కాపాడే ఎన్నికలని అఖిలేష్ యాదవ్ అభివర్ణించారు.