Wife: కూతురికి పెళ్లి చేశారు, ఆంటీకి ప్రియుడు ఉన్నాడని డౌట్, బెడ్ రూమ్ లో భార్య ?
బెంగళూరు/ మంగళూరు: వివాహం చేసుకున్న దంపతులు చాలా సంతోషంగా కాపురం చేశారు. దంపతులకు కూతురు, కొడుకు ఉన్నారు. కూతురికి పెళ్లి చేసి అత్తారింటికి పంపించారు. కొడుకు ఉద్యోగం చేస్తున్నాడు. ఆంటీ భర్త వ్యాపారం చేస్తున్నాడు. ఇటీవల దంపతుల మద్య గొడవలు ఎక్కువ అయ్యాయి. కొడుకు అతని పిన్నికి ఫోన్ చేసి ఇంటికి వెళ్లి చూడాలని, అమ్మా, నాన్న ఫోన్ రిసీవ్ చెయ్యడం లేదని, వెళ్లి చూడాలని చెప్పాడు. ఆమె ఇంటికి వెళ్లి చూడగా టీవీ ఆన్ చేసి తలుపులు ముందుకు వేసి ఉన్న విషయం గమనించి ఇంటి లోపలికి వెళ్లింది. బెడ్ రూమ్ లో మంచం మీద మహిళ శవమై కనిపించింది, అదే బెడ్ రూమ్ లో ఆమె భర్త ఉరి వేసుకుని వేలాడుతూ శవమై కనిపించాడు. చాలాకాలంగా ఆంటీ మీద అనుమానంతో అంకుల్ గొడవపడుతున్నాడని వెలుగు చూసింది.
Lovers: ప్రియుడి కేసులో ట్విస్ట్, పోలీస్ స్టేషన్ లో గిరిష్మా ఏంచేసిందంటే ?, సీక్రేట్ పెళ్లి !
దంపతుల హ్యాపీలైఫ్
కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలోని ఉళ్లాల సమీపంలోని సోమేశ్వర గ్రామంలో శివానంద పూజారి అలియాస్ శివానంద (50), శోభా పూజారి అలియాస్ శోభా (45) దంపతులు నివాసం ఉంటున్నారు. 22 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్న శివానంద పూజారి, శోభా దంపతులు 18 సంవత్సరాలు పాటు చాలా సంతోషంగా జీవితం సాగించారు.
సంవత్సరం క్రితం కూతురికి పెళ్లి
శివానంద, శోభా దంపతులకు కూతురు, కొడుకు ఉన్నారు, 18 నెలల క్రితం శివానంద, శోభా దంపతులు వారి కుమార్తెను మంగళూలోని ఓ యువకుడికి ఇచ్చి పెళ్లి చేశారు. మంగళూరులో నివాసం ఉంటున్న కొడుకు మొబైల్ షోరూమ్ లో ఉద్యోగం చేస్తున్నాడు. సొంత గ్రామంలో శివానంద, శోభా దంపతులు మాత్రమే నివాసం ఉంటున్నారు.
ఆంటీకి అక్రమ సంబంధం ఉందని డౌట్
రెండు సంవత్సరాల నుంచి శివానందకు అతని భార్య శోభా మీద అనుమానం ఎక్కువ అయ్యింది. తన భార్య శోభా వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుని తనను మోసం చేస్తోందని రగిలిపోయాడు. కూతురికి పెళ్లి చేసిన తరువాత తన భార్య శోభా వేరే వ్యక్తితో తిరుగుతోంది, మా ఇంటి పరువు తీస్తోందని శివానంద రగిలిపోయాడు.
వ్యాపారం చేస్తున్న భర్త ఏం చేశాడంటే ?
వ్యాపారం చేస్తున్న శివానంద ఎక్కువగా బయట తిరుగుతున్నాడు. రాత్రి ఇంటికి వెళ్లిన శివానంద అతని భార్య శోభాతో గొడవ పెట్టుకున్నాడు. ఆ సందర్బంలో ఇద్దరి మద్య గొడవ ఎక్కువ అయ్యింది. టీవీ ఆన్ చేసిన శివానంద ఇంటిలోని మాటలు బయటకు వినపడకుండా చేశాడు. తరువాత భార్య శోభాను పట్టుకుని చితకబాదేశాడు.
ఆంటీని చంపేసి ఆత్మహత్య
బెడ్ రూమ్ లో భార్య శోభాను గొంతు నులిమి హత్య చేసిన శివానంద అదే రూమ్ లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శోభాకు ఆమె కూతురు ఫోన్ చేసింది. శోభా మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో ఆమెకు అనుమానం వచ్చి మంగళూరులోనే ఉంటున్న తమ్ముడికి ఫోన్ చేసి చెప్పింది, కొడుకు ఫోన్ చేసినా శోభా మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది.
ఆంటీ మీద అనుమానంతో హత్య
శోభా కుమారుడు అతని పిన్నికి ఫోన్ చేసి ఇంటికి వెళ్లి చూడాలని, అమ్మా, నాన్న ఫోన్ రిసీవ్ చెయ్యడం లేదని, వెళ్లి చూడాలని చెప్పాడు. ఆమె ఇంటికి వెళ్లి చూడగా టీవీ ఆన్ చేసి తలుపులు ముందుకు వేసి ఉన్న విషయం గమనించి ఇంటి లోపలికి వెళ్లింది. బెడ్ రూమ్ లో మంచం మీద శోభా శవమై కనిపించింది,
ఆంటీని చంపేసి అంకుల్ ఆత్మహత్య
అదే బెడ్ రూమ్ లో శోభా భర్త శివానంద ఉరి వేసుకుని వేలాడుతూ శవమై కనిపించాడు. చాలాకాలంగా శోభా ఆంటీ అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో శివానంద గొడవపడుతున్నాడని, అందుకే ఆమెను హత్య చేసి అతను ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.