కాంగ్రెస్ లీడర్ కొడుకు అపార్ట్ మెంట్ రూ 100 కోట్లు

ముంబై: ముంబై మహానగరంలో కాంగ్రెస్ నాయకుడి కుమారుడు ఏకంగా రూ. 100 కోట్లకు ఓ అపార్ట్ మెంట్ కొనుగోలు చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. బీహార్ మాజీ గవర్నర్ డీవై పాటిల్ కుమారుడు అజింక్య పాటిల్ ఈ అపార్ట్ మెంట్ ను కొన్నారు..

ముంబై నగరంలోని వర్లి సమీపంలోని సిల్వరిన్ టెర్రస్ ప్రాంతంలో ఓ ట్రిపుల్ డూప్లెక్స్ అపార్ట్ మెంట్ ను అజింక్య పాటిల్ కొన్నారు. సముద్రానికి ఎదురుగా ఉండే ఈ 23 అంతస్తుల భవనం గురించి ముంబై నగరంలో దాదాపు అందరికి తెలుసు.

అజింక్య పాటిల్ కు ఏఐపీఎస్ రియల్ ఎస్టేట్ అనే కంపెనీ ఉందని. ఆ కంపెనీ పేరుతోనే ఈ అపార్ట్ మెంట్ లోని ఫ్లాట్ కొన్నారు. ఈ ఆస్తిని రూ. 95.4 కోట్లకు కొన్నామని, స్టాంప్ డ్యూటీ కింద రూ. 4.7 కోట్లు చెల్లించామని కంపెనీ ప్రతినిధి దిలీప్ కవాడ్ చెప్పారు.

DY Patil’s son buys Apartment in worli highrise for nearly Rs 100 Cr

21, 22, 23 అంతస్తుల్లో ఉన్న ట్రిపుల్ డూప్లెక్స్ అపార్ట్ మెంట్ పాటిల్ సొంతం అయ్యింది. ఈ ఆస్తిని కొనుగోలు చేశామని, ఇది కంపెనీకి మంచి పెట్టుబడి అవుతుందని కంపెనీ ప్రతినిధి దిలీప్ కవాడ్ అన్నారు.

దీనికి అద్బుతమైన టెర్రస్ తో పాటు మూడో పోడియం లెవల్ లో పార్కింగ్ సదుపాయం ఉందని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఈ రూ. 100 కోట్ల అపార్ట్ మెంట్ డీల్ మార్కెట్లో పెనుమార్పులకు దారి తీస్తుందని ముంబై రియల్ ఎస్టేట్ వర్గాలు అంటున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+