ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్లో భూకంపం
Recommended Video
న్యూఢిల్లీ: ఢిల్లీతో పాటు ఎన్సిఆర్ రీజియన్లో బుధవారం నాడు భూకంపాలు సంభవించినట్టు అధికారులు ప్రకటించారు. జమ్మూ కాశ్మీర్లో భూకంపం వచ్చిందని అధికారులు తేల్చారు.
ఆఫ్ఘనిస్తాన్లో భూకంపం వచ్చిన కొద్దిసేపటికే ఢిల్లీతో పాటు ఎన్సీఆర్ రీజియన్లో భూకంపం సంభవించింది. ఆప్ఘనిస్థాన్ లో సంభించిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 6.4గా నమోదైంది.
భూమికి సుమారు 96 కి.మీ . లోతులో ఈ భూకంపం సంభవించినట్టుగా అమెరికాకు చెందిన జియాలిజికల్ సర్వే అధికారులు తేల్చి చెప్పారు. ఆప్ఘనిస్తాన్ లోని కోరోగ్ ప్రాంతానికి సమీపంలో ఈ భూకంప కేంద్రం ఉందని అమెరికా శాస్త్రవేత్తలు ప్రకటించారు.
కాబూల్, పాకిస్తాన్ లలో భూకంపం కారణంగా ప్రజలు ఇళ్ళ నుండి బయటకు పరుగులు తీశారు. పాకిస్తాన్ లోని ఇస్లామాబాద్, ఫెషావర్ లలో కూడ భూకంప ప్రభావం కన్పించింది.
ఇండియాలో న్యూఢిల్లీతో పాటు జమ్మూ కాశ్మీర్ లో కూడ భూకంప ప్రభావం కన్పించింది. జమ్మూలో ప్రజలు ఇళ్ళ నుండి బయటకు పరుగెత్తారని రిపోర్టులు చెబుతున్నాయి.