ఎలక్షన్ కమీషన్ కీలక నిర్ణయం .. ఈవీఎంలు తరలించే వాహనాలకు జీపీఎస్
ఎన్నికలు సజావుగా జరగటం కోసం ,గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా ఉండడం కోసం ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. అందులో భాగంగా ఈసారి జరగనున్న ఎన్నికల్లో రిజర్వుడ్ ఈవీఎంలు, వీవీ ప్యాట్ స్లిప్ లను తరలించే వాహనాలకు జిపిఎస్ ను అమర్చి మరీ పర్యవేక్షించనున్నారు ఎన్నికల సంఘం అధికారులు. ఎటువంటి అవకతవకలు జరగకుండా ఎన్నికలు సజావుగా జరగడం కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లను, భద్రతా చర్యలుతేసుకుఎ క్రమంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది ఈసీ.
ఎలక్షన్ కమీషన్ కీలక నిర్ణయం .. జంతువులతో ప్రచారం నిషేధం
గతేడాది జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంలు, వీవీ ప్యాట్ స్లిప్ లు రోడ్లమీద, ఓ ఎమ్మెల్యే ఇంట్లో, హోటళ్లలో ఎక్కడపడితే అక్కడ దొరికిన నేపథ్యంలో ఈసీ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక అన్ని రాష్ట్రాలకు ఓటింగ్ యంత్రాలను నిర్దేశించిన గమ్యానికి చేర్చేవరకు చాలా జాగ్రత్తగా పర్యవేక్షించాలంటూ అన్ని రాష్ట్రాల ఎన్నికల అధికారులకు ఈసీ ఆదేశించింది.
బాధ్యతా రాహిత్యం ... సి విజిల్ ని కూడా సిల్లీగా వాడేస్తున్నారా ?
గతంలో చాలా సందర్భాల్లో ఈవీఎంలు మాయమైనా, పోలింగ్ అధికారులు శ్రద్ధ చూపకుండా చాలా నిర్లక్ష్యంగా వహించారని, అవసరమైన చర్యలు చేపట్టలేదని ఈసీ గుర్తించింది. అలాంటి నిర్లక్ష్యానికి చెక్ పెట్టటానికి అధికారులకు చాలా సీరియస్ గా ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే ఈ జీపీఎస్ పెట్టాలని నిర్ణయం తీసుకున్న ఎన్నికల సంఘం ఈ సారి ఎన్నికల్లో దాదాపు 39.6 లక్షల ఈవిఎంలను, 17.4 లక్షల వీవీ ప్యాట్ లు ఉపయోగించనున్నారు. ఎన్నికలు సజావుగా జరగడం కోసం, గతంలో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా ఉండడం కోసం ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది.