మాజీ సీఎం మాంఝీ కూతురుపై కేసు:'రాజకీయ కుట్ర'
పాట్నా: బీహార్ మాజీ ముఖ్యమంత్రి జీతన్ రామ్ మాంఝీకి ఝలక్. మాంఝీ కూతురు సునయన దేవి పైన పోలీసు స్టేషన్లో కేసు నమోదయింది. సమాచారం మేరకు.. సునయన దేవి కోడలు గత రెండు రోజులుగా కనిపించడం లేదు.
ఈ నేపథ్యంలో ఆ కోడలు తండ్రి... సునయనదేవి కుటుంబ సభ్యుల పైన అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తన కూతురిని సునయన దేవి కట్నం కోసం చంపి ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తండ్రి ఫిర్యాదు నేపథ్యంలో పోలీసులు సునయన దేవితో పాటు మరో నలుగురు కుటుంబ సభ్యుల పైన కేసు నమోదు చేశారు. అతను గయలోని డెల్గా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

సునయన దేవి కోడలు తండ్రి అయిన రామ్ దేవ్ మాంఝీ... తన కూతురు కనిపించడం లేదని ఫిర్యాదు చేశారని, అత్తింటి వారు కట్నం కోసం హత్య చేసి ఉంటారేమోనని అనుమానం వ్యక్తం చేశారని జిల్లా పోలీసు అధికారు చెబుతున్నారు.
తన కూతురును చంపేసి, ఆ విషయం తమకు చెప్పకుండానే దహనం చేసి ఉంటారని తండ్రి అనుమానిస్తున్నాడు. కాగా, సునయన తనయుడు విక్కీతో ఆమెకు 2008లో పెళ్లి జరిగింది. దీనిపై మాంఝీ పార్టీ అధికార ప్రతినిధి దనిష్ మాట్లాడుతూ... ఇది రాజకీయ కుట్ర అని, దళిత నేత పైన కుట్ర అని ఆవేదన వ్యక్తం చేశారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications