షాకింగ్: భారత్ ఓడిందని, ఆత్మహత్య చేసుకున్న యువతి!
ముంబై: గ్వాలియర్లో షాకింగ్ సంఘటన జరిగింది. ప్రపంచ కప్ ట్వంటీ 20లో భాగంగా వెస్టిండీస్ చేతిలో భారత్ ఓటమి నేపథ్యంలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది. గ్వాలియర్కు చెందిన ఆ అమ్మాయి సెమీ ఫైనల్లో భారత్ ఓడిన విషయం తెలియగానే ఆత్మహత్యకు పాల్పడింది.
సమాచారం మేరకు.. దుపట్టాతో సీలింగ్ ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. వెస్టిండీస్తో ఓటమి నేపథ్యంలో భారత్ ఫైనల్కు వెళ్లలేదని, భారత్ కప్ గెలవలేదని భావించి ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది.
మృతి చెందిన యువతి బిటెక్ చదువుతోంది. యువతి ఎలాంటి సూసైడ్ నోట్ రాయలేదు. అయితే, ఆమెకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఈ విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆమె భారత్ గెలుపు కోసం ప్రార్థించిందని చెబుతున్నారు.

యువతి పేరు సురుభి. ఆమె గ్వాలియర్లోని ఓ కళాశాలలో చదువుతోంది. ఆమె తన కుటుంబంతో కలిసి మ్యాచ్ చూసింది.
పోలీసులు మాట్లాడుతూ... మ్యాచ్ గెలిచేందుకు ఆమె పూజలు చేసిందని కుటుంబ సభ్యులు చెప్పారని, ప్రసాదం కూడా పంచినట్లు చెప్పారని తెలిపారు. ఆ తర్వాత ఆమె మృతదేహం గదిలో ఉంది. ఈ మృతి పైన పోలీసులు విచారణ జరుపుతున్నారు. క్రికెట్లో ఓడినందుకే ఆత్మహత్య చేసుకుందా లేక మరేదైనా కారణం ఉందా పోలీసులు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
-
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం..












Click it and Unblock the Notifications