కేజ్రీవాల్ కంటే ఐటం గర్ల్ రాఖీసావంత్ బెట్టర్: ఉద్దవ్థాకరే
ముంబై: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఎఎపి) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కంటే బాలీవుడ్ నటి రాఖీ సావంత్ చాలా బెట్టర్ అని శివసేన పార్టీ అధ్యక్షులు ఉద్దవ్ థాకరే శుక్రవారం మండిపడ్డారు. శివసేన పార్టీకి చెందిన పత్రిక సామ్నాలో ఉద్దవ్ తనదైన శైలిలో కేజ్రీవాల్ పైన వ్యాఖ్యలు చేశారు.
అరవింద్ కేజ్రీవాల్ కంటే బాలీవుడ్ ఐటమ్ గర్ల్ బాగా పాలించే వారన్నారు. అదే సమయంలో కేజ్రీవాల్ను పిచ్చి ముఖ్యమంత్రిగా వ్యాఖ్యానించిన కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేను వెనుకేసుకొచ్చారు.

ఢిల్లీ పోలీసుల తీరును నిరసిస్తూ అరవింద్ కేజ్రీవాల్ సోమవారం, మంగళవారం నడి రోడ్డు పైన రెండు రోజుల పాటు ధర్నా చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఉద్దవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్నా సమయంలో కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే పైన కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలను ఉద్దవ్ తప్పు పట్టారు. కేజ్రీవాల్ను సర్కస్లో రింగ్ మాస్టర్గా పేర్కొన్నారు.
కాగా, ఎఎపికి గట్టి మద్దతుదారు అయిన ప్రముఖ రచయిత చేతన్ భగత్ కేజ్రీవాల్ ధర్నా పైన రెండు రోజుల క్రితం స్పందించిన విషయం తెలిసిందే. రాజకీయాల్లో ఎఎపిని ఐటం గర్ల్గా ఆయన అభివర్ణించారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న కేజ్రీవాల్ నడి రోడ్డు పైన ధర్నాకు దిగడాన్ని ఆయన తప్పు పట్టారు.
ఆయన ఓ టీవీ ఛానల్తో మాట్లాడుతూ స్పందించారు. కేజ్రీవాల్, ఆయన సహచరులు రెండు రోజుల పాటు చేసిన ధర్నాను చూసి తాను సిగ్గుపడుతున్నానని అన్నారు. వారి ధర్నాతో ఢిల్లీలో ట్రాఫిక్ స్తంభించిపోయిందన్నారు. వ్యాపారంపై ప్రభావం చూపిందన్నారు. లోకసభ ఎన్నికల్లో గెలుపొందేందుకు, ఇప్పటికిప్పుడు ప్రజల దృష్టిని ఆకర్షించాలని కోరుకుంటున్నారని, అదేలా అంటే బాలీవుడ్లో ఒక నటి ఏమీ చేయలేని స్థితిలో ఐటమ్ గర్ల్గా మారిపోతుందని, అలానే రాజకీయాలల్లో ఎఎపి కూడా అలా మారిపోయిందన్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications