పెళ్లి బాగోతాన్ని బయటపెట్టిన ఫేస్బుక్: మహిళ ఫిర్యాదు
దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, గురువారం అతడ్ని అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్లో ఓ సంస్థకు డైరెక్టర్గా పని చేస్తున్నాడు నిందితుడైన ప్రణవ్ ముఖర్జీ(46).
ఓ పాఠశాలలో టీచర్గా పనిచేస్తున్న బాధిత యువతి(35)ని మాట్రిమోనియల్ సైట్లో చూసి నచ్చవంటూ రిక్వస్ట్ పెట్టాడు. తర్వాత రెండు నెలలపాటు ఇద్దరూ చాటింగ్ చేసుకున్నారు. ఆ తర్వాత రిజిస్టర్ వివాహం చేసుకుని మహారాష్ట్రలోని పుణెకు వెళ్లిపోయారు. 2014లో గుర్గావ్కు తమ కాపురాన్ని మర్చారు.
కాగా, ఇటీవల బాధిత మహిళ ఫేస్బుక్లో తన భర్త ప్రణవ్ ముఖర్జీ ప్రొఫైల్ను చూసింది. తన భర్తకు అప్పటికే వివాహమైందని, ఓ కూతురు కూడా ఉందని తెలిసింది. దీంతో షాక్ గురైన బాధితురాలు తన తల్లిదండ్రులకు విషయం చెప్పి, పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుడ్ని అరెస్ట్ చేశారు.