వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

instagram bug: ప్రమాదాన్ని గుర్తించిన 21ఏళ్ల హ్యాకర్ మయూర్‌ -వెంటనే రూ. 22లక్షలిచ్చిన Facebook

|
Google Oneindia TeluguNews

టెక్ జమానా ముందుకు పొతున్నకొద్దీ సైబర్ నేరారాలకు అంతు లేకుండా పోతున్నది. ప్రధానంగా సోషల్ మీడియాను సాధనంగా వాడుకుంటూ వేల మంది కేటుగాళ్లు అమాయకులను మోసం చేస్తోన్న ఉదంతాలు ఇటీవల పెరిగాయి. సైబర్ నేరాలను నివారించడానికి టెక్ సంస్థలు తమ వంతుగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అందులోని లోపాలను ఆసరగా చేసుకుని నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. నేరాల అదుపునకు సంస్థలతోపాటు ప్రైవేటు వ్యక్తులు, హ్యాకర్లు, ఐటీ డెవలపర్లు సైతం కీలక ప్రయత్నాలు చేస్తుండం తెలిసిందే. అలా ప్రఖ్యాత ఇన్‌స్టాగ్రామ్‌ లో అత్యంత ప్రమాదరక బగ్ ను కనిపెట్టి భారీ మొత్తంలో పారితోషికాన్ని కొట్టేశాడో యువకుడు..

Recommended Video

Instagram Bug: బ్లాక్‌ మెయిల్‌ అవకాశమున్న బగ్ Indian హ్యాకర్ కి Rs 22 Lakh || Oneindia Telugu

Etelaపై Jagan ఆగ్రహం -KCR బర్రెలు తినేవాడైతే నువ్వు గొర్రెలు తినే రకమంటూ -BJP, Modiపైనా ఫైర్Etelaపై Jagan ఆగ్రహం -KCR బర్రెలు తినేవాడైతే నువ్వు గొర్రెలు తినే రకమంటూ -BJP, Modiపైనా ఫైర్

ఫాలో కాకుండానే డేటా చోరీ..

ఫాలో కాకుండానే డేటా చోరీ..

సోషల్ మీడియాలో యూజర్ల సెక్యూరిటీపై అనేక అనుమానాలు, రోజుకో రకం ఉదంతాలు వెలుగులోకి రావడం చూస్తున్నదే. ప్రొఫైల్‌ లాక్‌ చేసుకునే సదుపాయాన్ని టెక్ కంపెనీలు కల్పిస్తున్నప్పటికీ, ఆయా యాప్స్ లోని చిన్న చిన్న బగ్స్‌ సైబర్‌ నేరగాళ్ల పాలిట వరంలా మారుతున్నాయి. అలాంటి ఓ బగ్‌నే ఇన్‌స్టాగ్రామ్‌లో కనుగొన్నాడు మహారాష్ట్రకు చెందిన 21 ఏళ్ల యువకుడు మయూర్ ఫర్తాడే. అతను కనిపెట్టిన బగ్ సాధారణమైనదేమీకాదు.. ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రైవేటు ఖాతాలను ఫాలో కాకుండానే యూజర్ల ఫొటోలు, వివరాలు దొంగిలించి, బ్లాక్‌ మెయిల్‌ చేయడం, వేధింపులకు పాల్పడడం వంటి నేరాలకు వీలు కల్పించే అవకాశమున్న బగ్ అది. దాని వల్ల సైబర్ నేరస్తులకు ఎలాంటి మేలు జరుగుతుందో గుర్తించిన మయూర్.. ఆ విషయాన్ని రుజువులతో సహా ఇన్‌స్టా మాతృ సంస్థ అయిన ఫేస్‌బుక్‌ కు తెలియజేశాడు.

LJP ముసలం: గాయపడ్డ సింహం బిడ్డను -బాబాయి పశుపతికి BJP అండపై Chirag Paswan విస్మయంLJP ముసలం: గాయపడ్డ సింహం బిడ్డను -బాబాయి పశుపతికి BJP అండపై Chirag Paswan విస్మయం

ప్రమాదాన్ని గుర్తించిన మయూర్

ప్రమాదాన్ని గుర్తించిన మయూర్


సోలాపూర్‌కు చెందిన మయూర్‌ ఫర్తడే కంప్యూటర్‌ సైన్స్‌లో ఇంజినీరింగ్‌ పూర్తి చేశాడు. ఇన్‌స్టాలో సైబర్‌ నేరగాళ్లు ఎలా అవతలి వ్యక్తుల పోస్టులను చూడగలరో పేర్కొన్నాడు. ఈ బగ్‌ ద్వారా ప్రైవేట్‌ ఇన్‌స్టా ఖాతాల ఫొటోలు, ఆర్కివ్డ్‌ పోస్టులు, స్టోరీలు, రీల్స్‌ తదితర వివరాలను పొందేందుకు అవకాశం ఉందని గుర్తించాడు. వ్యక్తుల పోస్టుకు సంబంధించిన మీడియా ఐడీ ద్వారా ఈ వివరాలను పొందొచ్చని కనుగొన్నాడు. మీడియా ఐడీ ద్వారా ఇన్‌స్టాగ్రామ్‌కు చెందిన డెవలపర్‌ లైబ్రరీలోని గ్రాఫ్‌క్యూఎల్‌ అనే టూల్‌ను ఉపయోగించి బ్రూట్‌ ఫోర్స్‌డ్‌ మీడియా ఐడీని ఎంటర్‌ చేయడం ద్వారా సదరు పోస్ట్‌ తాలూకా లింక్‌, పోస్ట్‌ వివరాలు పొందొచ్చన్న విషయాన్ని గుర్తించాడు.

బగ్ బౌంటీకి రూ.22 లక్షల రివార్డు..

బగ్ బౌంటీకి రూ.22 లక్షల రివార్డు..

ప్రమాదకర బగ్ ను కనిపెట్టిన విషయాన్ని మయూర్ గత నెలలో ఫేస్‌బుక్‌ దృష్టికి తీసుకెళ్లగా, ఆ సంస్థ ఇంజనీర్లు పరిశీలించి, మయూర్‌ చెప్పింది నిజమేనని నిర్ధారించుకున్నారు. ఆ వెంటనే మయూర్ ను అభినందిస్తూ ఫేస్‌బుక్‌ ఒక సందేశాన్ని పంపింది. ప్రమాదకరమైన బగ్‌ను కనుగొన్నందుకు గానూ రూ.22 లక్షల రివార్డును కూడా అందజేసింది. మంగళవారం(జూన్ 15న) ఆ డబ్బులు మయూర్ ఖాతాలో పడ్డాయి. భవిష్యత్‌లోనూ ఇలాంటి లోపాలుంటే గుర్తించి పంపించాలని ఫేస్ బుక్ కోరగా, బగ్‌ బౌంటీ(బగ్‌ల వేట)ని ఇకపైనా కొనసాగిస్తానని, దాన్ని పార్ట్‌టైమ్‌ ఉద్యోగంగా భావిస్తానని, సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌ అవ్వాలన్నదే తన లక్ష్యమని మయూర్ బదులిచ్చాడు.

English summary
Facebook has awarded Rs 22 lakh to an Indian hacker or developer for discovering malicious bugs on the Instagram app. The bug that was discovered allowed anyone to view archived posts, Stories, Reels and IGTV without following the user, even when the profile is private. Although Facebook had now addressed the issue, the bug if remained untouched would have let hackers gain illegal access to the private pictures, videos of users without following them.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X