Actress: ఫేమస్ నటికి అర్దరాత్రి వాట్సాప్ లో ఏం పంపించాడంటే ?, మేడమ్ దెబ్బకు సెంట్రల్ జైల్లో !
బెంగళూరు: ప్రముఖ నటితో ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ కుమారుడికి పరిచయం ఉంది. గతంలో ఫ్యాషన్ డిజైనర్ కొడుకు, ఆ నటి మంచి స్నేహితులు అని వారికి తెలిసినవాళ్లు అంటున్నారు. రానురాను నటికి, ఆ యువకుడి మద్య తేడాలు వచ్చాయి. ఇదే సమయంలో ఓ కేసుకు సంబంధించి ఆ నటి జైలుకు వెళ్లింది. జైలు నుంచి బెయిల్ మీద బయటకు వచ్చిన ఆ నటి మళ్లీ ఆ యువకుడితో టచ్ లో ఉందని తెలిసింది. మద్యలో మళ్లీ ఇద్దరి మద్య తేడాలు రావడంతో దూరం అయ్యారని తెలిసింది. అర్దరాత్రి పూట తనకు అసభ్యంగా మెసేజ్ లు పంపించి టార్చర్ చేస్తున్నాడని ఆరోపిస్తూ ఆ నటి ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ కొడుకు మీద పోలీసు కేసు పెట్టింది.
తనకు అర్దరాత్రి వాట్సాప్ లో ఆ వ్యక్తి నీఛంగా ఇలాంటి మెసేజ్ లు పంపించి నన్ను టార్చర్ పెట్టాడని, అతని మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఆ నటి పోలీసులను ఆశ్రయించింది. అయితే తాను ఆ నటికి ఎలాంటి మెసేజ్ లు పంపించలేదని, తన మీద కక్షతో ఆ నటి కేసు పెట్టిందని, గతంలోనే ఆమె ఫోన్ నెంబర్ తాను బ్లాక్ చేశానని ఆ యువకుడు ఆరోపిస్తున్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రముఖ ఫ్యాషన్ డిజైన్ కొడుకును అరెస్టు చేసి సెంట్రల్ జైలకు పంపించడం కలకలం రేపింది. వివాదాస్పద నటి మరోసారి మీడియాలో, చిత్రపరిశ్రమలో హాట్ టాపిక్ అయ్యింది.
Russia VS Ukraine: ఉక్రెయిన్ లో మేము బాంబుల దాడి చెయ్యలేదు, పుతిన్ పచ్చి అపద్దాలు!
ప్రముఖ నటితో స్నేహం
స్యాండిల్ వుడ్ కు చెందిన ప్రముఖ నటితో ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ప్రసాద్ బిద్దప్ప కుమారుడు ఆడమ్ బిద్దప్ప అలియాస్ ఆడమ్ కు పరిచయం ఉంది. గతంలో ఫ్యాషన్ డిజైనర్ కొడుకు ఆడమ్, స్యాండిల్ వుడ్ తోపాటు అనేక బాషల చిత్రాల్లో నటించిన ఆ నటి మంచి స్నేహితులు అని వారికి తెలిసినవాళ్లు అంటున్నారు.
జైలుపాలైన ప్రముఖ నటి
రానురాను ఆ నటికి, ఆడమ్ ల మద్య తేడాలు వచ్చాయి. ఇదే సమయంలో ఓ క్రిమినల్ కేసుకు సంబంధించి ప్రముఖ నటి జైలుకు వెళ్లింది. సెంట్రల్ జైలు నుంచి బెయిల్ మీద బయటకు వచ్చిన ఆ నటి మళ్లీ ఫ్యాషన్ డిజైనర్ కొడుకు ఆడమ్ తో టచ్ లో ఉందని తెలిసింది. మద్యలో బెంగళూరులోని ఇందిరానగర్ లో నివాసం ఉంటున్న ఆ నటికి, ఆడమ్ మద్య తేడాలు రావడంతో మళ్లీ దూరంగా ఉంటున్నారని తెలిసింది.
అర్దరాత్రి టార్చర్ పెడుతున్నాడు
అర్దరాత్రి పూట తనకు అసభ్యంగా మెసేజ్ లు పంపించి టార్చర్ చేస్తున్నాడని ఆరోపిస్తూ ఆ నటి ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ కొడుకు ఆడమ్ బిద్దప్ప మీద బెంగళూరులో పోలీసు కేసు పెట్టింది. తనకు అర్దరాత్రి వాట్సాప్ లో ఆడమ్ నీఛంగా ఇలాంటి మెసేజ్ లు పంపించి నన్ను టార్చర్ పెట్టాడని, అతని మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఆ నటి బెంగళూరు పోలీసులను ఆశ్రయించింది.
నేను అమాయకుడు.... అరెస్టు చేసిన పోలీసులు
అయితే తాను ఆ నటికి ఎలాంటి మెసేజ్ లు పంపించలేదని, తన మీద కక్షతో ఆ నటి కేసు పెట్టిందని, గతంలోనే ఆమె ఫోన్ నెంబర్ తాను బ్లాక్ చేశానని ఆడమ్ బిద్దప్ప ఆరోపిస్తున్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ప్రసాద్ బిద్దప్ప కొడుకు ఆడమ్ బిద్దప్పను అరెస్టు చేసి బెంగళూరు నగర శివార్లలోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలకు పంపించడం కలకలం రేపింది. వివాదాస్పద నటి మరోసారి మీడియాలో, కన్నడ చిత్రపరిశ్రమలో హాట్ టాపిక్ అయ్యింది.