ఈవ్ టీజింగ్ వద్దన్నందుకు తండ్రీకొడుకులను కాల్చేశారు
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. మహిళలను ఈవ్ టీజింగ్ చేయొద్దన్నందుకు ఓ తండ్రీకొడుకులను నలుగురు దుండగులు తుపాకులతో కాల్చేశారు. దీంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్నగర్లో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బల్వారా గ్రామానికి చెందిన నవాబ్(50), అతని కుమారుడు(22) పొలం నుంచి ఇంటికి వెళ్తుండగా.. నలుగురు దుండగులు మహిళలను వేధింపులకు గురిచేస్తున్నారు.

ఆ దుండగులను తండ్రీకొడుకులు వారించే ప్రయత్నం చేశారు. దీంతో రెచ్చిపోయిన దుండగులు నవాబ్, సందీప్లను తుపాకులతో కాల్చారు. దీంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే దుండగులు అక్కడ్నుంచి పరారయ్యారు.
బాధిత తండ్రీకొడుకులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, కేసు నమోదు చేసుకున్నారు. పరారీలో ఉన్న నలుగురు దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
-
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు












Click it and Unblock the Notifications