వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీ భారీ అగ్నిప్రమాదం: నలుగురు సజీవదహనం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం ఉదయం ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. షాదారా ప్రాంతంలోని మోహన్‌ పార్క్‌ ఏరియాలోని ఓ భవనంలో మంటలు చెలరేగి నలుగురు మృతి చెందారు.

నిద్రిస్తున్న సమయంలో ప్రమాదం సంభవించడంతో వారు అలాగే సజీవదహనహయ్యారు. మరో 10 మంది గాయపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలార్పారు.

భవనంలో చిక్కుకుని స్పృహకోల్పోయిన వారిని సిబ్బంది రక్షించారు. భవనంలోని చిన్న పిల్లలకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.

English summary
Delhi has been witnessing increasing fire incidences since the past few days. Early on Wednesday morning, fire broke out in a building in Mohan Park area of Shahdara which was later doused.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X