చెన్నైలో భారీ అగ్నిప్రమాదం: ఇద్దరు పిల్లలతో సహా ఐదుగురు మృతి
తమిళనాడు రాజధాని చెన్నై వడపళని ప్రాంతంలోని ఓ అపార్ట్మెంట్లో సోమవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు మృతిచెందగా, మరో 9మంది గాయపడ్డారు.
చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నై వడపళని ప్రాంతంలోని ఓ అపార్ట్మెంట్లో సోమవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు మృతిచెందగా, మరో 9మంది గాయపడ్డారు.
గ్రౌండ్ ఫ్లోర్లో విద్యుదాఘాతం కారణంగా మంటలు చెలరేగడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు. మంటలు వేగంగా వ్యాపించడంతో గ్రౌండ్ఫ్లోర్లో నివసిస్తున్న వారు తప్పించుకునేందుకు అవకాశం లేకుండా పోయినట్లు తెలుస్తోంది.

మంటల కారణంగా వ్యాపించిన పొగ పీల్చడం వల్లనే ఐదుగురు మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. మీనాక్షి(60), సెల్వి(35), సంధ్య(10), సంజయ్(3)తోపాటు మరొకరు మృతి చెందారు.
ఈ ప్రమాదం కారణంగా సెల్లార్లో ఉన్న 21 ద్విచక్ర వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి.
ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక యంతాలు మంటలను ఆర్పేశాయి. గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించారు.
More From
-
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
మహిళలకు రేవంత్ సర్కార్ ఉగాదికి భారీ కానుక, ఎన్నికల హామీ అమలు..!!












Click it and Unblock the Notifications