రూ.40లక్షల చిల్లర నోట్లను.. వారి మీద ఎగజల్లారు (వీడియో)
సంగీత కార్యక్రమం మొదలవగానే.. పెళ్లికి వచ్చిన బంధుమిత్రులు తమవద్ద ఉన్న రూ.10,రూ.20నోట్లను సంగీతకారులపై ఎగజల్లడం మొదలుపెట్టారు.
అహ్మదాబాద్: ఓవైపు దేశమంతా చిల్లర కష్టాలు పడుతుంటే.. మరోవైపు అహ్మదాబాద్ లో జరిగిన ఓ పెళ్లిలో లక్షల కొద్ది చిల్లర నోట్లను ఎగజల్లడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. నవ్సారిలో ఓ పెళ్లి కుటుంబం ఇంట సంగీత కార్యక్రమం జరగ్గా.. కార్యక్రమానికి హాజరైనవారు పోటీపడి మరీ చిల్లర నోట్లను ఎగజల్లడం గమనార్హం.
సంగీత కార్యక్రమం మొదలవగానే.. పెళ్లికి వచ్చిన బంధుమిత్రులు తమవద్ద ఉన్న రూ.10,రూ.20నోట్లను సంగీతకారులపై ఎగజల్లడం మొదలుపెట్టారు. ఈ డబ్బు విలువ దాదాపు రూ.40లక్షల వరకు ఉండవచ్చునని అంచనా. పురుషులతో పాటు మహిళలు సైతం పోటీ పడి చిల్లర నోట్లను విసురుతున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
కాగా, ఇంత భారీ మొత్తంలో చిల్లర నోట్లు వారి వద్దకు ఎలా వచ్చాయన్న దానిపై కూడా పలు సందేహాలు తలెత్తుతున్నాయి.
Approximately Rs 40 Lakhs (in Rs 10 & Rs 20 notes) showered on folk singers in a musical event in Navsari, Gujarat pic.twitter.com/Z7xByQ1toL
— ANI (@ANI_news) December 26, 2016
Approximately Rs 40 Lakhs (in Rs 10 & Rs 20 notes) showered on folk singers in a musical event in Navsari, Gujarat pic.twitter.com/Z7xByQ1toL
— ANI (@ANI_news) December 26, 2016