Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మహిళలకు ద్రోహం చేసి రేపిస్టులకు న్యాయం చేస్తారా ?, సీఎంను నిలదీస్తున్న మాజీ సీఎం, మార్చకుంటే !

నేరస్తును కాపాడటం కోసం సీఎం ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారని అనుమానం ఉందని మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు. నేర కార్యకలాపాలకు పాల్పడిన వారిని రక్షించేందుకు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై మాజీ సీఎం బసవరాజ్ బోమ్మయ్ ఆరోపించారు. ఓట్ల కోసం మహిళల జీవితాలతో చెలగాటం ఆడుతారా ? అంటూ సిద్దరామయ్య ప్రభుత్వాన్ని మాజీ సీఎం బసవరాజ్ బోమ్మయ్ ప్రశ్నించారు.

శనివారం కర్ణాటకలోని హనగల్‌లో గ్యాంగ్ రేప్ కేసు దర్యాప్తు విషయంలో నిరసన వ్యక్తం చేసిన మాజీ సీఎం బసవరాజ్ బోమ్మయ్ విలేకరులతో మాట్లాడుతూ సిద్ధరామయ్య నేతృత్వంలోని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వంలో నేరగాళ్లు ఎక్కువ అవుతున్నారని, వాళ్ల బెడద పెరుగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నేరం చేసిన వారి వర్గంలో ఓటు బ్యాంకు ఉందని, అందుకే కేసు దర్యాప్తు పక్కదోవ పట్టిస్తున్నారని మాజీ సీఎం బసవరాజ్ బోమ్మయ్ ఆరోపించారు.

Former CM Basavaraj Bommai accused the Siddaramaiah government in Karnataka of trying to protect the rapists.

గ్యాంగ్ రేప్ విషయంలో హానగల్‌లో పెద్దఎత్తున నిరసనలు, ధర్నాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అయినా పోలీసు శాఖ కళ్లు మూసుకుని నిద్రపోతున్నదని, గ్యాంగ్ రేప్ కేసును పక్కాగా విచారిస్తున్నామని పైకి మాత్రం అంటున్నారని బసవరాజ్ బోమ్మయ్ ఆరోపించారు. కేసు దర్యాప్తు చేస్తున్న సమయంలో ఇద్దరు పోలీసులను ప్రభుత్వం ఎందుకు సస్పెండ్ చేసింది అని మాజీ సీఎం బసవరాజ్ బోమ్మయ్ సిద్దరామయ్య ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

సిద్దరామయ్య ప్రభుత్వం గ్యాంగ్ రేప్ కేసు దర్యాప్తు విషయంలో పద్దతి మార్చుకోకపోతే న్యాయపోరాటం చేస్తామని బసవరాజ్ బోమ్మయ్ హెచ్చరించారు. అత్యాచార బాధితురాలికి సరైన వైద్యం అందించలేదని,. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు బాధితులకు వైద్యం అందించేందుకు ప్రభుత్వం కృషి చేయాలని, కేసు దర్యాప్తు సిట్‌కు అప్పగించాలని మాజీ సీఎం బసవరాజ్ బోమ్మయ్ కర్ణాటకలోని సిద్దరామయ్య ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

ఈ ధర్నా కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నేత ఆర్.అశోక్ కూడా పాల్గొంటారు. బాధితులు చేస్తున్న ఈ పోరాటానికి సిద్దరామయ్య ప్రభుత్వం తలొగ్గకపోతే న్యాయపోరాటం చేస్తామని ఆర్ అశోక్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సిద్దరామయ్య ప్రభుత్వం గ్యాంగ్ రేప్ కేసు నిందితులను కాపడటానికి ప్రయత్నిస్తే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని బసవరాజ్ బోమ్మయ్ హెచ్చరించారు. రాజకీయ ఒత్తిళ్లతో అధికారులు రేపిస్టులకు అండగా నిలుస్తున్నారని, పోలీసులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని, కేసును మూసివేయడానికి ప్రయత్నిస్తున్నారని మాజీ సీఎం బసవరాజ్ బోమ్మయ్ ఆరోపించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+