కర్నాటకలో బీజేపీ-జేడీఎస్ పొత్తు ? తోసిపుచ్చిన కుమారస్వామి.. కానీ..
కర్నాటకలో గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయ వాతావరణం మారిపోయింది. కాంగ్రెస్ భారీ విజయంతో విపక్షంగా మారిన బీజేపీతో పాటు జేడీఎస్ కూడా వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పొత్తు పెట్టుకునేందుకు అడుగులు వేస్తున్నాయి. ఈ దిశగా చర్చలు కూడా ప్రారంభించాయి. అయితే ఇవాళ అనూహ్యంగా జేడీఎస్ నేత కుమారస్వామి బీజేపీతో పొత్తు పెట్టుకునే అంశాన్ని తోసిపుచ్చారు. కానీ చర్చలు జరుగుతున్నట్లు మాత్రం అంగీకరించారు.
వచ్చే ఏడాది లోక్సభ ఎన్నికలకు ముందు జేడీఎస్ బీజేపీతో పొత్తు పెట్టుకున్నట్లు వస్తున్న వార్తలను జనతాదళ్ (సెక్యులర్) నేత హెచ్డి కుమారస్వామి ఇవాళ తోసిపుచ్చారు. చర్చలు ఇంకా ప్రాథమిక దశలో ఉన్నాయని, ఇంకా చాలా చర్చలు జరగాల్సి ఉందన్నారు. తాజాగా జేడీఎస్ తో పొత్తుపై బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడియూరప్ప చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కుమారస్వామి స్పందించారు. జేడీఎస్ తో ఒప్పందం అమల్లో ఉన్నట్లు తాజాగా యడియూరప్ప వ్యాఖ్యానించారు.
యడ్యూరప్ప స్పందన ఆయన వ్యక్తిగతమని కుమారస్వామి తెలిపారు. ఇప్పటి వరకు సీట్ల పంపకాలతో పాటు మరే ఇంతర అంశాలపైనా చర్చ జరగలేదన్నారు. తాము మర్యాదపూర్వకంగా కలిశామన్నారు. ఇవి ప్రారంభ దశల చర్చలు మాత్రమే అన్నారు. యడియూరప్ప జేడీఎస్ గురించి మంచిగా మాట్లాడారని, అందుకు ఆయనకు ధన్యవాదాలు చెబుతున్నట్లు కుమారస్వామి వెల్లడించారు.
అలాగే మాండ్య లోక్ సభ సీటులో పోటీపై జేడీఎస్ పట్టుదలగా ఉన్నట్లు వస్తున్న వార్తల్ని కూడా కుమారస్వామి తోసిపుచ్చారు.

-
మంగళూరు చేరిన భారీ ఎల్పీజీ షిప్- గ్యాస్ కష్టాలకు చెక్ -
భారత పారిశ్రామిక వృద్ధి రేటు తగ్గుదల.. యుద్ధం కంటే ముందే..! -
అప్పటి వరకూ పాకిస్థాన్ కు నో వాటర్: భారత్ సంచలనం -
కిర్రాక్ ఫీచర్లతో Boat Valour Watch 1R.. ధర ఎంతంటే ?? -
ఏసీ గదుల్లో ఎక్కువగా ఉంటున్నారా- అయితే, ఇది తెలుసుకోవాల్సిందే..!! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు












Click it and Unblock the Notifications