పార్లమెంటులో కుప్పకూలిన మాజీ కేంద్రమంత్రి అహమద్
మాజీ కేంద్రమంత్రి అహమద్ మంగళవారం ఉదయం ప్రారంభమైన బడ్జెట్ సమావేశంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.
న్యూఢిల్లీ: మాజీ కేంద్రమంత్రి అహమద్ మంగళవారం ఉదయం ప్రారంభమైన బడ్జెట్ సమావేశంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో సభ్యులందరూ ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించారు. ఆయన వెంట ఓ వైద్యుడిని కూడా పంపించారు.

మంగళవారం ఉదయం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పార్లమెంటులో ఉభయసభలను ఉద్దేశించి మాట్లాడారు. అదే సమయంలో మాజీ మంత్రి అహమద్ ఒక్కసారిగా నేలపై కుప్పకూలిపోయారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
అస్వస్థత కారణంగానే ఆయన కిందపడిపోయినట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న కాలంలో అహమద్ జూనియర్ విదేశీ మంత్రిగా పని చేశారు.












Click it and Unblock the Notifications