సవాల్ చేసి ఓడిపోయా, ఎంపీగా రాజీనామా చేస్తానంటే మోడీ వద్దన్నారు: దేవేగౌడ
న్యూఢిల్లీ: మాజీ ప్రధానమంత్రి దేవేగౌడ 16వ లోకసభ చివరి సమావేశాల్లో మాట్లాడారు. ఈ సందర్భంగా 2014 ఎన్నికల్లో బీజేపీ అద్భుత విజయం తర్వాత తాను రాజీనామా చేస్తానని చెబితే, ప్రధాని నరేంద్ర మోడీ వద్దని చెప్పారని గుర్తు చేసుకున్నారు. బుధవారం 16వ లోకసభ చివరి సమావేశాలు చివరి రోజు. ఈ సందర్భంగా దేవేగౌడ మాట్లాడారు.
గత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన తర్వాత రాజీనామా చేసేందుకు తాను ముందుకు వచ్చానని, కానీ ఎంపీగా కొనసాగాలని తనను ప్రధాని మోడీ కోరారని తెలిపారు.

ఎన్నికల సమయంలో ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు, ప్రతి విమర్శలు చేస్తుంటామని, అలాగే 2014 లోకసభ ఎన్నికల సందర్భంగా నేను మోడీకి ఓ సవాల్ విసిరానని, ఈ ఎన్నికల్లో బీజేపీ 276 సీట్ల కంటే ఎక్కువ గెలిస్తే తాను రాజీనామా చేస్తానని చెప్పానని, కానీ బీజేపీ 282 సీట్లు సాధించిందని, దీంతో నేను విసిరిన సవాల్ ప్రకారం ఎంపీ పదవికి రాజీనామా చేసేందుకు మోడీ వద్దకు వెళ్లానని, అప్పుడు మోడీ తనను రాజీనామా చేయవద్దని చెప్పారని గుర్తు చేసుకున్నారు.
దానిని అంత సీరియస్గా తీసుకోవద్దని, మీకు రాజకీయాల్లో ఎంతో అనుభవం ఉందని, మీలాంటి వాళ్లు రాజీనామా చేయకూడదని తనతో చెప్పారని అన్నారు. ఈ అయిదేళ్లలో నేను మోడీని మూడు, నాలుగు సార్లు కలిశానని, తనకు ఎవరిపైనా వ్యక్తిగతంగా విభేదాలు లేవని చెప్పారు.
-
కేంద్రానికి కవిత షాకింగ్ అల్టిమేటం.. ఆ విషయంలో పోరాటమే! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!!











Click it and Unblock the Notifications