నేపాల్లో రెండు చోట్ల బాంబు పేలుడు.. నలుగురు మృతి
నేపాల్లో రెండు చోట్ల బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ పేలుళ్లలో నలుగురు వ్యక్తులు మృత్యువాతపడగా మరో ఏడుగురు వ్యక్తులు గాయపడ్డారు. కాగా ఆదివారం సాయంత్రం 4.30 గంటలకు ఖఠ్మాండులోని సుకేధర, ఘట్టెకు, నాగ్దుంగా ఏరియాల్లో బాంబు పేలుళ్లు జరిగాయి.

కాఠ్మండులోని జనావాసల మధ్యలో ఈ పేలుళ్లు జరగడంతో అక్కడిక్కడే ఓ వ్యక్తి మృతి చెందాడు. అనంతరం మరో పేలుడు సైతం నగర శివారులోని సుకేధరలో ఓ సెలున్ షాపులో పేలింది. దీంతో మొత్తం పేలుళ్లలో నలుగురు మృత్యువాత పడ్డారు. కాగా ఈ పేలుళ్లకు నగరంలోని పలు షాపుల గోడలు బీటలు వారాయి. కాగా బాంబు పేలిన ప్రాంతాన్ని నెపాల్ ఆర్మీ తమ ఆధీనంలోకి తీసుకుంది. అయితే ఈ పేలుళ్లకు సంబంధింది ఏ సంస్థ బాధ్యత వహిస్తూ ప్రకటన వెలువరించలేదు.












Click it and Unblock the Notifications