ప్రజల ఆరోగ్యంపై మోడీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి, 'మోడీ కేర్' పొందాలంటే ఎలా?
న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం భారత ప్రజల ఆరోగ్య సంరక్షణకు సంబంధించి పలు కార్యక్రమాలను చేపట్టింది. నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ మిషన్ ద్వారా దేశంలోని ఎక్కువ మంది ప్రజలను హెల్త్ ఇన్సురెన్స్ పరిధిలోకి తీసుకు వచ్చే ప్రయత్నాలు చేస్తోంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద హెల్త్ స్కీం కానుంది.
అదే మోడీ కేర్. ఈ హెల్త్ ఇన్సురెన్స్ పథకం ద్వారా భారతదేశంలోని దాదాపు 40 శాతం మంది ప్రజలకు లబ్ధి చేకూర్చే ప్రయత్నాలు చేస్తున్నారు. కుటుంబానికి రూ.5 లక్షల వరకు ఉచిత హెల్త్ ఇన్సురెన్స్ ఉండనుంది. సామాజిక, ఆర్థిక గణన ఆధారంగా దీంతో 10 కోట్లకు పైగా కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది.

అంతేకాదు, మోడీ ప్రభుత్వం వ్యాధి నిరోదక శక్తి పైన విస్తృత ప్రచారం చేస్తోంది. మిషన్ ఇంద్రధనుష్ ద్వారా 528 జిల్లాల్లో 3.15 కోట్లకు పైగా చిన్నారులకు, 80 లక్షల మంది గర్భిణీ స్త్రీలకు టీకాలు ఇచ్చారు.
మోడీ ప్రభుత్వం ఇటీవలే ప్రతిష్టాత్మక ఆయుష్మాన్ భారత్ను ప్రారంభించింది. ఇది జాతీయ ఆరోగ్య సంరక్షణ పథకం. సమాజంలోని అన్ని వర్గాలకు ఆరోగ్య సంరక్షణ చేరాలనేదే ఆయుష్మాన్ భారత్ ప్రయత్నం. తద్వారా దాదాపు 50 కోట్ల మందికి ఈ పరిధిలోకి రానున్నారు.
మోడీ కేర్
- ఈ ఆరోగ్య పథకం కిందకు రావడానికి కుటుంబం పరిమితి, వయస్సు, మహిళలు, పురుషులు అనే నిబంధనలు ఏవీ లేవు. కుటుంబంలోని అందరికీ వర్తిస్తుంది.
- ఎస్ఈసీసీ డాటా బేస్ ప్రకారం అర్హులైన అన్ని కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుంది.
- ఈ ఆరోగ్య పథకం కిందకు వచ్చేవారు ఆసుపత్రిలో డబ్బులు చెల్లించవలసిన అవసరం లేదు.
- ఆసుపత్రిలో జాయిన్ కావడానికి ముందు నుంచి ఆ తర్వాత కూడా ఈ హెల్త్ స్కీమ్ కవర్ అవుతుంది.
- మీరు దేశవ్యాప్తంగా ఏదైనా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లినా లేదా ప్రయివేటు ఆసుపత్రికి వెళ్లినా ఉచితంగా వైద్య చికిత్స పొందవచ్చు.
- ఆసుపత్రిలో ఉచిత చికిత్స కోసం ఇందుకు సంబంధించిన ఐడీ కార్డును తీసుకు వెళ్లవలసి ఉంటుంది.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications