నాలుగు గోడల మధ్యే: 'శ్రీరాములు-గాలి మధ్య రాజీ కుదుర్చుతా'
నాలుగు గోడల మధ్య పరిష్కరించుకునే సమస్యను వీధిలోకి తేవడం సరికాదని, ఇంటి స్థలాల విక్రయం అంశంపై తన సోదరుడు కరుణాకర్ రెడ్డి, ఎంపీ శ్రీరాములుకి మధ్య రాజీ కుదుర్చుతానని మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర రెడ్డి అన
బళ్లారి: నాలుగు గోడల మధ్య పరిష్కరించుకునే సమస్యను వీధిలోకి తేవడం సరికాదని, ఇంటి స్థలాల విక్రయం అంశంపై తన సోదరుడు కరుణాకర్ రెడ్డి, ఎంపీ శ్రీరాములుకి మధ్య రాజీ కుదుర్చుతానని మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర రెడ్డి అన్నారు.
ఎంపీ బి శ్రీరాములు తమకు సోదరుడితో సమానమన్నారు. తమ కుటుంబ శ్రేయస్సుకు శ్రీరాములు ఎంతో కృషి చేస్తున్నారన్నారు.
పెళ్లికి పిలువలేదు: గాలికి షాక్, కరుణాకర్ రెడ్డి, శ్రీరాములు మధ్య విభేదాలు
కాగా, గతంలో తమ సోదరుడు కరుణాకర రెడ్డి పేరిట 2.7 ఎకరాలు, ఎంపీ శ్రీరాములు పేరు మీద 8.75 ఎకరాల స్థలాన్ని సంయుక్తంగా కొనుగోలు చేశారు. దానిని అభివృద్ధి చేసి సుష్మా స్వరాజ్ కాలనీగా ఏర్పాటు చేశారు.
ఇందులో శ్రీరాములు ఎనిమిది ఇళ్లస్థలాలను విక్రయించారు. ఈ విషయంలోనే వివాదం తలెత్తిందని సోమశేఖర రెడ్డి చెప్పారు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇరు వర్గాలు పరస్పరం పెట్టుకున్న కేసులు ఉపసంహరింప చేస్తామన్నారు.
తమ సోదరుడు కరుణాకర రెడ్డి కొంతకాలంగా తమ కుటుంబాలకు దూరంగా ఉంటున్న విషయం వాస్తవమేనన్నారు. గనుల వ్యవహారంలో గాలి జనార్దన్ రెడ్డి అరెస్టయి జైల్లో ఉన్నపుడు కరుణాక రెడ్డి ఒకసారి వెళ్లి పలకరించి వచ్చారు. అనంతరం ఓసారి సీబీఐ అధికారులు తనతో పాటు తన సోదరుడు కరుణాకరరెడ్డిని విచారించారన్నారు.
అప్పటి నుంచి ఆయన తమ కుటుంబాలకు దూరంగా ఉంటున్నారని తెలిపారు. భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రాకుండా అంతా కలిసి ఉండేలా కృషి చేస్తానన్నారు.