Gandhi family: గాంధీలు లేకుండా కాంగ్రెస్ ను ఊహించుకోలేము, వాళ్లు ఉంటేనే మనం ఉంటాము !
బెంగళూరు: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తరువాత కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీద కొందరు నాయకులు, కార్యకర్తలు మండిపడుతున్న విషయం తెలిసిందే. ఎన్నికల్లో పోటీ చేసే విషయం దగ్గర నుంచి ఎన్నికల ప్రచారం చేసే విషయం వరకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పూర్తిగా విఫలం అయ్యిందని ఆ పార్టీకి చెందిన కొందరు నాయకులు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మార్పులు రావాలని డిమాండ్లు మొదలైనాయని తెలిసింది. ఇదే సమయంలో గాంధీలు లేని కాంగ్రెస్ పార్టీని కార్యకర్తలు చూడలేరని, గాంధీలు లేకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసి ఉండటం సాధ్యం కాదని కేపీసీసీ చీఫ్ డీకే. శివకుమార్ అంటున్నారు.
కాంగ్రెస్ పార్టీని అడ్డం పెట్టుకుని లాభం పొందాలని అనుకునేవాళ్లు మాత్రమే ఇప్పుడు ఆ పార్టీని విమర్శిస్తున్నారని, అధికార దాహం ఉన్న వాళ్లు మాత్రమే కాంగ్రెస్ పార్టీని వదిలేసి బయటకు వెళ్లిపోతున్నారని కేపీసీసీ చీఫ్, మాజీ మంత్రి, ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గాంధీలు లేని కాంగ్రెస్ పార్టీని అసలుసిసలైన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఊహించుకోవడం చాలా కష్టం అని డీకే శివకుమార్ అంటున్నారు.

కాంగ్రెస్ పార్టీ నిర్లక్షం ?
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తరువాత కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీద కొందరు నాయకులు, కార్యకర్తలు మండిపడుతున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ నిర్లక్షం వలనే ఆ పార్టీ నాయకులు సర్వనాశనం అవుతున్నారని, ఎక్కడ పోటీ చేసినా ఓటమి తప్పడం లేదని కొందరు కాంగ్రెస్ పార్టీ నేతలు విచారం వ్యక్తం చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.

నాయకత్వంలో లోపం
ఎన్నికల్లో పోటీ చేసే విషయం దగ్గర నుంచి ఎన్నికల ప్రచారం చేసే విషయం వరకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పూర్తిగా విఫలం అయ్యిందని ఆ పార్టీకి చెందిన కొందరు నాయకులు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మార్పులు రావాలని, అప్పుడు పార్టీ బాగుపడుతుందని అనేక డిమాండ్లు మొదలైనాయని తెలిసింది.

గాంధీలేని కాంగ్రెస్ పార్టీనా ?
సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలు లేని కాంగ్రెస్ పార్టీని కార్యకర్తలు చూడలేరని, గాంధీలు లేకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసి ఉండటం సాధ్యం కాదని కేపీసీసీ చీఫ్, కర్ణాటక మాజీ మంత్రి, ట్రుబుల్ షూటర్ డీకే. శివకుమార్ అంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి నాకయత్వం వహించే సత్తా గాంధీ కుటంబానికే ఉందని డీకే శివకుమార్ చెప్పారని ఎన్ డీటీవీ కథనం ప్రసారం చేసింది.

స్వార్థపరులు బయటకు వెళ్లిపోతున్నారు
కాంగ్రెస్ పార్టీని అడ్డం పెట్టుకుని లాభం పొందాలని అనుకునేవాళ్లు మాత్రమే ఇప్పుడు ఆ పార్టీని విమర్శిస్తున్నారని, అధికార దాహం ఉన్న వాళ్లు మాత్రమే కాంగ్రెస్ పార్టీని వదిలేసి బయటకు వెళ్లిపోతున్నారని, గాంధీలు లేని కాంగ్రెస్ పార్టీని మేము ఊహించుకోలేమని కేపీసీసీ చీఫ్, మాజీ మంత్రి, ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Recommended Video

జీవితాంతం మేమే ఉంటాము
గాంధీలు లేని కాంగ్రెస్ పార్టీని అసలుసిసలైన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఊహించుకోవడం చాలా కష్టం అని డీకే శివకుమార్ అన్నారని ఎన్ డీటీవీ వార్తలు ప్రసారం చేసింది. ఎవరు ఉన్నా లేకున్నా మేము మాత్రం జీవితాంతం గాంధీలకు విధేయులుగానే ఉంటామని డీకే శివకుమార్ స్పష్టం చేశారు.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications