Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రాయగఢ్ పేపర్ మిల్లులో గ్యాస్ లీకేజ్ ... విశాఖ ఘటన మరవకముందే మరో ఘటన

ఏపీలో ఎల్జీ పాలిమర్స్ వద్ద విష వాయువుల లీకేజ్ ఘటన దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది . ఇక ఈ ఘటనలో తీవ్రంగా అస్వస్థత పాలైన చాలా మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికి 11 మంది మరణించారు . ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్యాస్ లీకేజ్ ఘటన మరచిపోక ముందే ఛత్తీస్‌ గడ్ రాష్ట్రంలోని రాయగఢ్ పేపర్ మిల్లులో గురువారం గ్యాస్ లీక్ కావడంతో ఏడుగురు కార్మికులు ఆసుపత్రి పాలయ్యారు. కార్మికుల్లో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తుంది .

ఇంతకాలం లాక్ డౌన్ తో మూసి ఉన్న మిల్లును తిరిగి ప్రారంభించే క్రమంలో రాయగఢ్ పేపర్ లో మిల్లులోని ట్యాంక్ క్లినింగ్ చేస్తుండగా గ్యాస్ లీకై, ఏడుగురు కార్మికులు అస్వస్థతకు లోనయ్యారు. దాంతో వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ఏడుగురిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని, వారిని రాజధాని రాయ్‌పూర్‌కు తరలిస్తున్నట్లు సమాచారం. లాక్డౌన్ అయినప్పటి నుండి మూసివేయబడిన మిల్లును త్వరలో తిరిగి తెరవాలని కార్మికులు ట్యాంకులు శుభ్రం చేస్తున్నారు.

Gas leakage at Raigarh paper mill.. 7 workers hospitalised, 3 critical

ఇక ఈ క్రమంలో ఒక్కసారిగా విష వాయువులు లీక్ అయ్యి ఏడుగురు కార్మికులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. రాయగఢ్ పోలీసు సూపరింటెండెంట్ సంతోష్ సింగ్ మరియు కలెక్టర్ యశ్వంత్ కుమార్ గ్యాస్ లీక్‌తో బాధపడుతున్న వారిని పరామర్శించారు . ఈ సంఘటనను దాచడానికి మిల్లు యజమాని ప్రయత్నించాడని, పోలీసులకు సమాచారం ఇవ్వలేదని పోలీసు సూపరింటెండెంట్ తెలిపారు. కేసు నమోదు చేస్తామని తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+