చెట్టుకు వేలాడిన మరో యువతి: ఆత్మహత్యేనా?
అలీఘర్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఖేరేశ్వర్ ఆలయం సమీపంలోని లోధా ప్రాంతంలో దారుణం చోటు చేసుకుంది. ఓ యువతి చెట్టుకు ఉరివేసుకుని విగత జీవిగా కనిపించింది. అయితే ఇది ఆత్మహత్యగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
మృతురాలు హర్దస్పూర్ గ్రామానికి చెందిన మధు(20)గా పోలీసులు గుర్తించారు. ఆమెకు త్వరలోనే వివాహం జరుగనుందని పోలీసులు తెలిపారు. ఆదివారంనాడు బాధిత యువతి తన తల్లితో గొడవపడిందని, ఈ నేపథ్యంలో ఆమె ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పోలీసులు చెప్పారు.

మృతురాలిని ఆమె తండ్రి సింగ్వీర్ సింగ్ గుర్తించాడని పోలీసులు తెలిపారు. అతను కూలీగా పని చేస్తున్నాడని చెప్పారు.
సింగ్వీర్ సింగ్ ఏడుగురి సంతానంలో బాధిత యువతే పెద్దదని పోలీసులు వెల్లడించారు. ఆమె ఇటీవల జరిగిన ఇంటర్మీడియట్ పరీక్షలు రాసి పాసయ్యిందని తెలిపారు.












Click it and Unblock the Notifications