వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
దేవాలయం సమీపంలో తవ్వకాలు: 505 బంగారు నాణేలు లభ్యం
చెన్నై: తమిళనాడులోని ఓ దేవాలయం పరిసరాల్లో జరిగిన తవ్వకాల్లో 505 బంగారు నాణేలు లభించాయి. ఈ బంగారు నాణేల మొత్తం బరువు 1.716 కిలోలుగా ఉంది. తమిళనాడులోని తిరువనైకావల్లో ఉన్న జంబుకేశ్వరర్ దేవాలయంలో బుధవారం జరిపిన తవ్వకాల్లో ఈ నాణేలు బయటపడ్డాయి.
ఈ మొత్తం నాణేల్లో 504 చిన్నవి కాగా, ఒకటి మాత్రం పెద్దగా ఉందని ఆలయ అధికారులు తెలిపారు. క్రీస్తుశకం 1000 నుంచి 1200కు చెందినవిగా అంచనా వేస్తున్నారు.
దేవాలయం పరిసరాల్లో తవ్వకాలు జరుపుతుండగా ఏడు అడుగుల లోతులో ఓ మట్టి పాత్రలో ఈ నాణేలు లభించాయని ఆలయ అధికారులు తెలిపారు. పాత్రతో సహా బంగారు నాణేలను పోలీసులకు అప్పగించినట్లు దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు. అనంతరం వీటిని ప్రభుత్వ ట్రెజరీకి తరలించి తదుపరి దర్యాప్తు చేపడుతున్నారు.
Comments
English summary
As many as 505 gold coins weighing 1.716 kilograms were found in a vessel while digging near the Jambukeswarar Temple in Thiruvanaikaval here on Wednesday.
Story first published: Thursday, February 27, 2020, 21:49 [IST]