మరోసారి పెరిగిన బంగారం, వెండి ధరలు
న్యూఢిల్లీ: గత కొద్దిరోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఈరోజు మళ్లీ పెరిగాయి. మంగళవారం నాటి ట్రేడింగ్లో 10 గ్రాముల బంగారం ధర రూ.175 పెరిగి రూ.29,700కి చేరింది.
బంగారం కొనుగోళ్లపై స్థానిక ఆభరణాల తయారీదారులు ఆసక్తి చూపడం, అంతర్జాతీయ పరిస్థితులు సానుకూలంగా ఉండటం బంగారం ధర పెరుగుదలపై ప్రభావం చూపాయని బులియన్ మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. బంగారం బాటలోనే వెండి ధరలు కూడా పెరగడం గమనార్హం. రూ.150 పెరిగి.. కిలో వెండి ధర రూ.38,250కి చేరింది.

నాణెల తయారీదారులు, పారిశ్రామిక వర్గాల నుంచి డిమాండ్ పెరగడంతో వెండి ధర పెరిగినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అంతర్జాతీయంగా పసిడి ధర 0.18శాతం పెరిగి ఔన్సు 1,264.20 డాలర్లు, వెండి 0.15శాతం పెరిగి ఔన్సు 16.16 డాలర్లు పలికాయి.












Click it and Unblock the Notifications