వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వాళ్లనే గవర్నర్ పిలవాలి: కర్ణాటకలో యడ్యూరప్ప ప్రభుత్వం ఏర్పాటుపై శివసేన

By Srinivas
|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కకర్ణాటకలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుపై శివసేన స్పందించింది. మెజార్టీ ఎవరికి ఉంటే వారిని గవర్నర్ పిలవాలని చెప్పింది. తద్వారా గవర్నర్ తీరును తప్పుబట్టింది. జేడీఎస్ - కాంగ్రెస్ పార్టీలకు మెజార్టీ ఉందని శివసేన అభిప్రాయపడింది.

యడ్యూరప్పను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం సరికాదని అభిప్రాయపడింది. యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేసినా బలం నిరూపించుకోవడం అంత ఈజీ కాదన్నారు. అలాగే, కర్ణాటక ఎన్నికల ఫలితాలు బీజేపీకి అనుకూలంగా ఉన్నా 2019లో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని శివసేన తెలిపింది.

కర్ణాటకలో ఊహించని ట్విస్టులు: ఢిల్లీకి మారిన సీన్, యడ్యూరప్పకు తాత్కాలిక ఊరటకర్ణాటకలో ఊహించని ట్విస్టులు: ఢిల్లీకి మారిన సీన్, యడ్యూరప్పకు తాత్కాలిక ఊరట

Governor should have called those who had maximum numbers: Shiv Sena

మరోవైపు, ప్రమాణ స్వీకారం అనంతరం ఫ్లోర్ టెస్ట్ గురించి యడ్యూరప్ప మాట్లాడుతూ.. రేపటి వరకు లేదా ఎల్లుండి వరకు వేచి చూడండి అని వ్యాఖ్యానించారు.

కాగా, కర్ణాటకలో యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. బీజేపీ 104 స్థానాల్లో గెలుపొందగా, కాంగ్రెస్ 78, జేడీఎస్ 38 స్థానాల్లో గెలిచింది. శాసన సభలో బలం నిరూపించుకునేందుకు యడ్యూరప్పకు గవర్నర్ 15 రోజుల సమయం ఇచ్చారు. ప్రమాణ స్వీకారం చేసి యడ్యూరప్ప తన పంతం నెగ్గించుకున్నారు.

English summary
Governor should have called those who had maximum numbers, says Shiv Sena.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X