ఏప్రిల్1: మోదీ సర్కార్ మరో షాక్ -సుకన్య, పీపీఎఫ్ లాంటి చిన్నమొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు తగ్గింపు
అధిక ధరల భారం, ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ, కరోనా విలయం తదితర ఇబ్బందులతో విలవిల్లాడుతోన్న దేశ ప్రజలకు కేంద్రంలోని మోదీ సర్కార్ మరో భారీ షాకిచ్చింది. చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో డబ్బులు దాచుకునే వారికి చేదు వార్త చెప్పింది. ఏప్రిల్ 1 నుంచి 'స్మాల్ సేవింగ్ స్కీమ్స్'పై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ బుధవారం ప్రకటన చేసింది.
గుడ్న్యూస్: చిన్నపిల్లకూ వ్యాక్సిన్ -100శాతం సమర్థత -ఫైజర్ కంపెనీ సంచలన ప్రకటన
కరోనా విలయ కాలంలోనూ కొంతలో కొంత ఉపశమనంగా గడిచిన మూడు త్రైమాసికాలుగా చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను స్థిరంగా కొనసాగించిన కేంద్రం.. ఇప్పుడు వాటిని తగ్గిస్తున్నట్లు స్పష్టం చేసింది, స్మాల్ సేవింగ్ స్కీమ్స్పై వడ్డీ రేట్లను 40 నుంచి 110 బేసిస్ పాయింట్ల మధ్యలో కోత విధించినట్లు ఆర్థిక శాఖ పేర్కొంది. అలాగే,
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్ఎఫ్) వడ్డీ రేటు 7.1 శాతం నుంచి 6.4 శాతానికి తగ్గించారు. పీపీఎఫ్ వడ్డీ రేటు 7 శాతం కంటే కిందకు రావడం గడిచిన 46 ఏళ్లల్లో ఇదే తొలిసారి. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (ఎన్ఎస్సీ) వడ్డీ రేటును కూడా 6.8 శాతం నుంచి 5.9 శాతానికి తగ్గించారు. ఆడపిల్లల కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన పొదుపు పథకాలను కూడా కేంద్రం వదల్లేదు..
జగన్ సర్కార్ మరో భూదందా -ఇళ్ల పట్టాల అసలు కథ -నిమ్మగడ్డకు హ్యాట్సాఫ్: వైసీపీ ఎంపీ రఘురామ
బాగా పాపులరైన సుకన్య సమృద్ధి యోజన పథకంపై వడ్డీ రేటు7.6 శాతం నుంచి 6.9 శాతానికి తగ్గించారు. ఇక పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్పై వడ్డీ రేటును 1.1 శాతం వరకు తగ్గింది. వీటిపై వడ్డీ రేటు 4.4 శాతం నుంచి 5.3 శాతం మధ్యలో ఉంది. గత ఏడాది కాలంలో మోదీ సర్కార్ స్మాల్ సేవింగ్ స్కీమ్స్పై వడ్డీ రేట్లను తగ్గించడం ఇది రెండో సారి కావడం గమనార్హం.