ప్రభుత్వం భయపడింది.. తప్పు చేసింది, అందుకే చర్చించలే: రాహుల్ గాంధీ
వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటామని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించంగా.. ఇవాళ ఉభయ సభ బిల్లు ఆమోదం పొందింది. అయితే చట్టాల రద్దుకు సంబంధించి బిల్లుపై చర్చ లేకుండానే ఆమోదం తెలిపింది. దీనిపై ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ పెదవి విరిచింది. చర్చ లేకుండా బిల్లు ఆమోదించడం ఏంటీ అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. అంటే చర్చించడానికి ప్రభుత్వం భయపడుతుంది అని ఆయన కామెంట్ చేశారు.
లోక్ సభ, రాజ్యసభలో విపక్ష సభ్యుల నినాదాల మధ్య రెండు బిల్లులకు సభలు ఆమోదం తెలిపాయి. చర్చ జరపాలని విపక్ష సభ్యులు పట్టుబట్టారు. రైతుల కన్నా దేశంలో ముగ్గురు, నలుగురు వ్యాపారులు అత్యంత శక్తిమంతులు అని రాహుల్ ఆరోపించారు. అందుకోసమే ఇవాళ ఇలా జరిగి ఉంటుందని కామెంట్ చేశారు. కానీ వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకునే అంశం మాత్రం.. అన్నదాతల విజయమేనని రాహుల్ గాంధీ స్పష్టంచేశారు.

ఏదో తప్పు చేసినందునే ప్రభుత్వం భయపడుతోందని రాహుల్ గాంధీ అన్నారు. వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ దేశంలో ఆందోళనలు మిన్నంటిన సంగతి తెలిసిందే. నిరసనల సమయంలో 750 మంది రైతులు ప్రాణ త్యాగం చేశారు. అందుకు బాధ్యులు ఎవరనీ.. ఇచ్చే పరిహారంతో ఆ కుటుంబాలకు న్యాయం జరుగుతుందా అని అడిగారు. బిల్లు ప్రవేశపెట్టి.. చట్టం చేసే సమయంలో తప్పు అని తెలియదా అని అడిగారు.
పంటకు కనీస మద్దతు ధర కోసం రైతులు అడుగుతున్నారని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. చనిపోయిన రైతు కుటుంబాలకు పరిహారం తప్పకుండా ఇవ్వాల్సిందేనని రాహుల్ స్పష్టంచేశారు. యూపీ ఇతర రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని చట్టాలను వెనక్కి తీసుకున్నారని పేర్కొన్నారు. పంజాబ్ ఎన్నికలు కూడా వస్తున్నాయని ఆయన గుర్తుచేశారు.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ?












Click it and Unblock the Notifications