కరోనా షాకింగ్: దగ్గాడని స్నేహితుడ్ని తుపాకీతో కాల్చేశాడు!
గ్రేటర్ నోయిడా: ప్రపంచాన్ని కరోనావైరస్ వణికిస్తున్న నేపథ్యంలో ప్రజలు ఎవరు తుమ్మినా, దగ్గినా వారిని దూరం పెడుతున్నారు. సామాజిక దూరాన్ని పాటించాలని ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తున్న నేపథ్యంలో గ్రేటర్ నోయిడాలో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది.
గ్రేటర్ నోయిడాలో లూడో ఆట ఆడుతుండగా 25ఏళ్ల ఓ వ్యక్తి కావాలనే దగ్గుతున్నాడని గొడవ పెట్టుకున్న మరొకరు ఏకంగా అతడిని తుపాకీతో కాల్చేశాడు. జర్చా పోలీస్ స్టేషన్ పరిధిలోని దయానగర్ ఆలయంలో మంగళవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

ప్రశాంత్ సింగ్ అలియాస్ ప్రవేశ్(25), జైవీర్ సింగ్ అలియాస్ గుల్లూ(30) దయానగర్లో వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. కాగా, మంగళవారం రాత్రి మరో ముగ్గురితో కలిసి వీరు లూడో ఆడుతున్నారు. ఆ సమయంలో అక్కడేవున్న ప్రవేశ్ దగ్గడంతో అతడితో వాగ్వాదానికి దిగారు గుల్లూ.
ఇద్దరి మధ్యా గొడవ ముదరడంతో సహనం కోల్పోయిన గుల్లూ వెంట తెచ్చుకున్న తుపాకీ తీసి అతడిని కాల్చేశాడు. దీంతో ప్రవేశ్ గాయాలపాలయ్యాడు. వెంటనే అతడ్ని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
కాల్పులకు తెగబడిన జైవీర్ సింగ్ తోపాటు ఆటలో పాల్గొన్న ఇతరుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. కాగా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 735 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 11 మరణాలు సంభవించాయి. మరో 51 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications