జనవరి ఫస్ట్ నుంచి తక్కువ ధరలు.. ఆ వస్తువులేంటో తెలుసా?
Recommended Video

ఢిల్లీ : 23 వస్తువులపై తగ్గించిన జీఎస్టీ ధరలు జనవరి ఫస్ట్ నుంచి అమల్లోకి రానున్నాయి. ఇటీవల నిర్వహించిన జీఎస్టీ కౌన్సిల్ లో 23 రకాల వస్తు సేవలపై శ్లాబులు తగ్గించారు. టీవీలు, మానిటర్లు, పవర్ బ్యాంకులు, సినిమా టికెట్లు, నిల్వ చేసిన కూరగాయలు ఇలా సామాన్యులకు అందుబాటులో ఉండే 23 రకాల వస్తు సేవలపై జీఎస్టీ తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. రీట్రేడింగ్ టైర్లు, లిథియం ఆయాన్ పవర్ బ్యాంకులు, డిజిటల్ కెమెరాలు, వీడియో గేమ్స్, కప్పీలు.. ఇలాంటి వాటిపై 28 శాతంగా ఉన్న జీఎస్టీ పన్నును 18 శాతానికి తగ్గించారు.

ఇక ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వారు ఉపయోగించే యంత్రాలు, పరికరాలపై ఇప్పటివరకు అమలవుతున్న 28 శాతం జీఎస్టీని 5 శాతానికి కుదించారు. సరుకు రవాణా చేసే వాహనాలకు సంబంధించి థర్డ్ పార్టీ భీమా ప్రీమియం 18 శాతం నుంచి 12 శాతానికి తగ్గింది. ప్యాక్డ్ కూరగాయలతో పాటు నిల్వ చేసిన కూరగాయలు, కెమికల్స్ తో భద్రపరిచే కూరగాయలు లాంటి వాటికి జీఎస్టీ నుంచి మొత్తానికే పన్ను మినహాయింపు ఇచ్చారు. ఇక జన్ధన్ యోజన ఖాతాదారులను కూడా జీఎస్టీ పన్ను బాధ నుంచి విముక్తి కల్పించారు.
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications