వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
గుజరాత్ ఎన్నికలు: ముగిసిన ప్రచారం, ఢిల్లీకి మోడీ, రాహుల్
అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం ముగిసింది. ప్రచారం ముగిసిన అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ, కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్ గాంధీ ఢిల్లీకి బయలుదేరారు.
అంతకుముందు రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. తొలి విడత అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత కాంగ్రెస్ తప్పకుండా గెలుస్తుందన్న నమ్మకం మరింత పెరిగిందన్నారు.
జగన్నాథ ఆలయాన్ని దర్శించుకొన్న అనంతరం అహ్మదాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆలయాలకు వెళ్లడంపై బీజేపీ చేస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు.
ఏ సమయంలోనైనా తనకు ఆలయాలకు వెళ్లే హక్కు ఉందని, తాను కేదారినాథ్ కూడా వెళ్లానని, తాను ఆలయాలకు వెళ్లేది గుజరాత్ ప్రజల భవిష్యత్ బాగుండాలని, అభివృద్ధి చెందాలని, ఆలయాలకు వెళ్లడం తప్పా అని ప్రశ్నించారు.
Comments
gujarat assembly elections 2017 gujarat assembly elections gujarat assembly election 2017 gujarat assembly election congress bjp narendra modi raghul gandhi గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు 2017 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్ బీజేపీ నరేంద్ర మోడీ రాహుల్ గాంధీ
English summary
Campaigning Closes On Final Day for Gujarat Assembly Election. PM Narendra Modi and Rahul Gandi leave for Delhi after complete campaign.
Story first published: Tuesday, December 12, 2017, 18:25 [IST]