జర్నలిస్ట్ హత్య కేసు: గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్, మరో ముగ్గురికి జీవిత ఖైదు
న్యూఢిల్లీ: జర్నలిస్ట్ హత్య కేసులో డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్కు న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. పంచకుల ప్రత్యేక కోర్టు ఈ శిక్షను ఖరారు చేసింది. ఈ హత్య కేసులోని మరో ముగ్గురు నిందితులకు కూడా న్యాయస్థానం జీవిత ఖైదు, రూ.50వేల జరిమానా విధించింది.
2002లో జర్నలిస్ట్ రామచందర్ ఛత్రపతి దారుణ హత్యకు గురయ్యారు. డేరాబాబా అక్రమాలపై ఆయన తన పత్రికలో వరుస కథనాలు ఇచ్చారు. పూర్ సచ్చా పేరుతో అతను కథనాలు ఇచ్చారు. దీంతో ఆయనపై కక్ష కట్టి హత్య చేశారు. హర్యానాలోని సిర్సా పట్టణంలో ఈ హత్య జరిగింది.

మహిళలపై అత్యాచారం కేసులో డేరాబాబా ఇప్పటికే శిక్ష అనుభవిస్తున్నాడు. కాగా, గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్కు కోర్టు శిక్షను ఖరారు చేయడానికి ముందే హర్యానా వ్యాప్తంగా పోలీసులను మోహరించారు. ఎలాంటి ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications