కచ్చితంగా చెప్పలేను.. పవన్ వస్తారో! రారో!: జేడీఎస్ నేత కుమారస్వామి
బెంగళూరు: కర్ణాటక ఎన్నికల్లో ప్రధాన పోటీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అయినప్పటికీ.. జేడీఎస్ కూడా సత్తా చాటుతుందన్న అంచనాలు ఉన్నాయి. ఎన్నికల్లో హంగ్ ఏర్పడితే గనుక.. జేడీఎస్ కింగ్ మేకర్ గా మారుతుందన్న అభిప్రాయాలూ ఉన్నాయి. అయితే తామెవరికీ మద్దతినిచ్చేది లేదని, అవసరమైతే మళ్లీ ఎన్నికలకైనా వెళ్తామని ఆ పార్టీ ఇదివరకే స్పష్టం చేసింది.
ఇకపోతే కర్ణాటక ఎన్నికల్లో అన్ని పార్టీలు సినీ గ్లామర్ ను ఉపయోగించుకుంటున్నాయి. కన్నడ స్టార్స్ అయిన దర్శన్, సుదీప్ వంటి హీరోలు సీఎం సిద్దరామయ్య తరుపున ఇప్పటికే ఎన్నికల క్యాంపెయిన్ మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో జేడీఎస్ తరుపున పవన్ కల్యాణ్ కూడా ప్రచార బరిలో దిగుతారా? అని చాలామంది ఆ పార్టీ నేత కుమారస్వామిని ప్రశ్నిస్తున్నారు.

తాజాగా ఆయనో తెలుగు టీవి చానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్బంగా పవన్ కల్యాణ్ గురించి ప్రస్తావించగా.. ప్రచారానికి ఆయన వచ్చేది రానిది కచ్చితంగా చెప్పలేమన్నారు. గతంలో పవన్ కల్యాణ్ ఇక్కడికి వచ్చి, తమ పార్టీ తరఫున ప్రచారం నిర్వహిస్తానని చెప్పారని, అయితే, కొన్ని అనివార్య కారణాల వల్లే ఆయన ఇంతవరకూ రాలేకపోయారని అన్నారు.
ఇక కర్ణాటక ఎన్నికల్లో అందరు అంటున్నట్టు హంగ్ ఏర్పడే ఛాన్సే లేదని, తమ పార్టీ 120కి పైగా స్థానాలను సులువుగా గెలుస్తుందని కుమారస్వామి అన్నారు.
-
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ?












Click it and Unblock the Notifications