పాఠశాలలకు సెలవు.. భారీ వర్షాలతో ప్రభుత్వం అప్రమత్తం
తమిళనాడును భారీ వర్షాలు వీడడం లేదు. ఎడతెరిపిలేని వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కుండపోత వానలు కురుస్తుండటంతో చెన్నైతో పాటు పలు ప్రాంతాలు నీటమునిగాయి. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో తమిళనాడు, ఆంద్రప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ప్రభావిత ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. చెన్నైతో పాటు, తిరువళ్లూర్, వెల్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు, విల్లుపురం, కడలూరు, మయిలాడుతురై, తంజావూరు, రామనాథపురం, దిండిగుల్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.భారీ వర్షాలు కురుస్తున్న నేథ్యంలో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తుంది. ప్రభావిత జిల్లాల్లో పాఠశాలలకు గురువారం సెలవు ప్రకటించింది. కేంద్రపాలిత ప్రాంతాలైన పుదుచ్చేరి, కారైకల్ లో వాతావరణశాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో ఇక్కడ పాఠశాలలు, కాలేజీలను మూసివేశారు. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం స్టాలిన్ ఆదేశించారు. ముందుస్తు చర్యలు చేపట్టాలని , లోతట్టు ప్రాంత ప్రజలకు పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచింది. ప్రజలకు అవసరమైన నిత్యవసర వస్తువులు అందించాలని జిల్లా అధికారయంత్రానికి ముఖ్యమంత్రి ఆదేశించారు.













Click it and Unblock the Notifications