కేరళ, పుదుచ్చేరి, అస్సాంలో భారీగా పోలింగ్-ఓట్ల శాతాలివే..1
ఇవాళ కేరళ, అస్సాం రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీకి ఒకే దశలో జరిగిన పోలింగ్ లో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టారు. దీంతో ఈ మూడు చోట్ల కూడా భారీ పోలింగ్ శాతాలు నమోదయ్యాయి. ఇవాళ సాయంత్రం 5 గంటల తర్వాత ఈ మూడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ శాతాల్ని (voter turnout) ఈసీ ప్రకటించింది. ఇందులో పుదుచ్చేరి భారీ పోలింగ్ శాతం నమోదు చేసుకోగా.. అస్కాం, కేరళలోనూ పలు రికార్డులు నమోదయ్యాయి.
పుదుచ్చేరిలో అత్యధికంగా 86.92 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆ తర్వాత అస్సాంలో 84.42 శాతం పోలింగ్ , కేరళలో 75.01 శాతం పోలింగ్ నమోదైంది. అస్సాంలోని మొత్తం 126 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల సమయానికి సుమారు 84.42 శాతం ఓటింగ్ నమోదైందని ఈసీ తెలిపింది. ఇది 2021 ఎన్నికల్లో నమోదైన 82.04 శాతం పోలింగ్ను దాటేసింది. ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు సాగినట్లు తెలుస్తోంది.

అలాగే కేరళలోని మొత్తం 140 అసెంబ్లీ స్థానాలకు ఇవాళ జరిగిన పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగిసింది. ఆ తర్వాత కూడా పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. సాయంత్రం 5 గంటల సమయానికి కేరళలో 75.01 శాతం పోలింగ్ నమోదైంది. ఇది 2021 అసెంబ్లీ ఎన్నికల్లో నమోదైన 74.06 శాతం పోలింగ్ కంటే స్వల్పంగా ఎక్కువ. మరోవైపు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో కూడా 30 అసెంబ్లీ నియోజకవర్గాలకు సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగిసింది. గడువుకు ముందే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న ఓటర్లను క్యూలలో వేచి ఉండి, తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అనుమతించారు. ఇక్కడ ప్రాథమిక అంచనాల ప్రకారం పోలింగ్ శాతం 86 శాతానికి పైగా నమోదైంది.
-
Assembly Poll Survey: బెంగాల్, అస్సాంలో గెలుపెవరిది ? షైనింగ్ ఇండియా తాజా సర్వే..! -
Tamil Nadu Survey: తమిళనాడు విజేతను తేల్చేసిన ఏబీపీ సర్వే-ఎవరికెన్ని సీట్లంటే..? -
రాష్ట్రానికి 7వ వేతన సంఘం వర్తింపు -
Tamil Nadu Verdict: తమిళనాట సీన్ రివర్స్-డీఎంకేకు షాకిచ్చిన తాజా సర్వే..! -
Tamil Nadu Poll Survey: తమిళనాడులో షాకింగ్ ఫలితాలు-లోక్ పోల్ తుది సర్వేలో వారే క్లీన్ స్వీప్..! -
ఇరాన్ పోరాటం భారత్ కు నేర్పుతున్న పాఠం..! టీఎంసీ ఎంపీ కీలక వ్యాఖ్యలు..! -
స్టాలిన్, మమతకు ఈసీ భారీ షాకులు- సర్వే జోస్యాల వేళ సంచలన నిర్ణయాలు..! -
కేరళ, పుదుచ్చేరి, అసోంలో నేడే పోలింగ్.. ఏర్పాట్లు పూర్తి.. -
Revanth Reddy:కేరళం గడ్డపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..ఇద్దరి మధ్య సీక్రెట్ డీల్..!! -
ఆ కేసుల సంగతేంటి..? పినరయి విజయన్ కు సీఎం రేవంత్ ఘాటు లేఖ -
Lockdown: ఇవాళ రాత్రి నుంచే కర్ఫ్యూ, ప్రభుత్వం సంచలన నిర్ణయం! -
సమ్మర్ స్పెషల్ 'బాదంపాలు'.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి..!











Click it and Unblock the Notifications