అయ్యో.. పానీపురి కోసం వెళ్లిన విద్యార్థినిపై గ్యాంగ్ రేప్..
దేశంలో మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. చిన్నా పెద్దా అని తేడా లేకుండా మృగాళ్లా అమ్మాయిలపై దాడులకు పాల్పడుతున్నారు. మహిళలపై అత్యాచారాలను రూపుమాపేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు.. కఠినమైన చట్టాలు తీసుకొచ్చినా మార్పు రావడం లేదు. ఆఖరికి పాఠశాలలు, కాలేజీలు, యూనివర్సిటీల్లో కూడా విద్యార్థినులకు రక్షణ లేకుండా పోయింది. తాజాగా బెంగాల్ లో జరిగిన మరో షాకింగ్ ఘటన ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
గతంలో బెంగాల్ లోని కోల్ కతా ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో ఓ వైద్య విద్యార్థినిపై అత్యాచారం జరిగిన ఘటన ఇప్పటికీ సంచలనంగానే ఉంది. తాజాగా మానవ మృగాళ్ల చేతిలో మరో వైద్య విద్యార్థిని బలైంది. ఈ ఘటన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. దుర్గాపుర్ లోని ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతున్న వైద్య విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ జరిగినట్లు తెలుస్తోంది. ఒడిషాలోని జలేశ్వార్ కు చెందిన యువతి తన స్నేహితుడితో కలిసి శుక్రవారం రాత్రి పానీపురి తినేందుకు కాలేజీ నుంచి బయటకు వెళ్లారు. అప్పుడు సమయం రాత్రి 8 గంటల 30 అవుతోంది.
అయితే కొందరు అల్లరి మూకలు వాళ్లని వెంబడిస్తూ వేధించసాగాయి. యువతితో ఉన్న యువకుడిని పక్కకు నెట్టేసి.. యువతిని కాలేజీ వెనకాల ఉన్న అడవిలోకి లాక్కెళ్లారు. అక్కడ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాక బాధితురాలి మొబైల్ ఫోన్ లాక్కుని దూరంగా పడేసి అక్కడి నుంచి పరారయ్యారు. విద్యార్థిని ఫ్రెండ్ వెంటనే జరిగిన విషయం తన హాస్టల్ లోని స్టూడెంట్స్ కు చెప్పగా అందరు కలిసి బాధితురాలిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.
సమాచారం అందిన వెంటనే ఒడిషాలోని జలేశ్వార్ నుంచి బాధితురాలి పేరెంట్స్ వచ్చారు. తక్షణమే ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కాలేజీలో సరైన భద్రతా చర్యలు లేవని మండిపడ్డారు. ఈ మేరకు కాలేజీ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఈ ఘటనపై దుర్గాపుర్ న్యూ టౌన్ షిప్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులకోసం గాలింపు చర్యలు చేపట్టామని ఇప్పటివరకు ఎలాంటి అరెస్ట్ లు చేయలేదని తెలిపారు.

ఇటీవల బెంగాల్ లో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో మమతా బెనర్జీ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలోనూ ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో ఓ వైద్య విద్యార్థిని అత్యాచారానికి గురైంది. ఆ తర్వాత సౌత్ కలకత్తాలో ఓ లా స్టూడెంట్ పై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు కొందరు దుండగులు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications