ఉగ్రదాడి నుంచి తప్పించుకున్న హృతిక్: మోడీ దిగ్భ్రాంతి
ఇస్తాంబుల్/ముంబై: ప్రముఖ బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ పెను ఉగ్రదాడి నుంచి తప్పించుకున్నారు. హృతిక్ తన పిల్లలు హృహాన్, హృదాన్లతో కలిసి విహారయాత్రకు స్పెయిన్, ఆఫ్రికా వెళ్లారు. యాత్ర ముగించుకుని ఇస్తాంబుల్ నుంచి ముంబై చేరుకోవాల్సి ఉంది.
ఈ క్రమంలో హృతిక్కు ఇస్తాంబుల్ నుంచి కనెక్టింగ్ విమానం మిస్ అయింది. వెంటనే ఎయిర్పోర్ట్ అధికారులు హృతిక్కు దగ్గరుండి ఏర్పాట్లు చూసుకున్నారు. ముంబైకి వెళ్లాల్సిన మరో విమానం మరుసటి రోజు ఉండడంతో ఎకానమీ క్లాస్లో టికెట్ బుక్ చేసుకుని వెంటనే ముంబై బయలుదేరిపోయాడు హృతిక్.
ఎయిర్పోర్టులో ఉగ్ర బీభత్సం: కాల్పులు, ఆత్మాహుతితో 36మంది మృతి(వీడియో)
ఈ విషయాన్ని హృతిక్ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. 'ఇస్తాంబుల్ ఎయిర్పోర్ట్ అధికారులకు కృతజ్ఞతలు. ఉగ్రవాదులు మరోసారి అమాయకుల్ని బలితీసుకున్నారు. అందరం ఒకటిగా నిలిచి ఉగ్రవాదాన్ని అరికట్టాలి.' అంటూ హృతిక్ ట్వీట్ ద్వారా పిలుపునిచ్చారు.
కాగా, హృతిక్ విమానాశ్రయం నుంచి బయల్దేరిన గంటల వ్యవధిలోనే ఇస్తాంబుల్ విమానాశ్రయంలో ఉగ్రవాదులు మారణ హోమం సృష్టించి 36మందిని బలితీసుకున్నారు. ఈ దాడిలో 150మందికి పైగా గాయాలపాలయ్యారు.
ఉగ్రదాడిని ఖండించిన మోడీ
ఇస్తాంబుల్ ఉగ్రదాడి ఘటనపై భారత ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇస్తాంబుల్ దాడి అమానుషమని, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు మోడీ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా ఇస్తాంబుల్ దాడిని ఖండించారు.
Feel so sad about the Istanbul airport attacks...wonderful city wonderful people may God give them strength...what's the world coming to ???
— Arjun Kapoor (@arjunk26) June 29, 2016
missed connecting flight at Istanbul n wer stuck at airport next flight ws next day,but took economy n flew out earlier. #Prayers4istanbul
— Hrithik Roshan (@iHrithik) June 28, 2016