మరో వ్యక్తితో ఫోన్లో భార్య, అందంగా కనిపించొద్దని ముక్కు కొరికిన భర్త
లక్నో: ఉత్తర ప్రదేశ్లో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన భార్య పైన అనుమానంతో ఆమె ముక్కును కొరికేశాడు. యూపీలోని షాజహాన్పూర్కు చెందిన సంజీవ్ రాథోడ్ కొంతకాలంగా తన భార్య కమలేశ్ పైన అనుమానం పెంచుకున్నాడు.
బుధవారం కమలేశ్ ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతోంది. ఇది గమనించిన సంజీవ్ రాథోడ్ ఆమెతో గొడవ పడ్డాడు. కోపంలో, తన భార్య ఎవరికీ ఆమె అందంగా కనిపించకూడదని భావించి ముక్కు కొరికేశాడు. ముక్కు తెగడంతో భారీగా రక్త స్రావం అయింది. ఆమెను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. భర్త పరారీలో ఉన్నాడు. స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేసారు.
చుట్టు పక్కల వారు మాట్లాడుతూ... సంజీవ్ రాథోడ్ - కమలేష్ దంపతులు తమకు కొంతకాలంగా తెలుసునని చెప్పారు. తన భార్య ఏడేళ్లుగా ఓ వ్యక్తితో ఫోన్లో మాట్లాడుతున్నట్లు సంజీవ్ రాథోడ్ చెప్పేవాడని కొందరు చెబుతున్నారు. కాగా, అతను తన భార్య ముక్కు కొరికిన సమయంలో తాగి ఉన్నాడు.