శశికళ భజన చేసిన తమిళనాడు మంత్రి: సీఎం పళని మీద అసంతృప్తి, స్లీపర్ సెల్ మంత్రి కాదు !
తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారిపోతున్నాయి. బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు నుంచి చిన్నమ్మ శశికళ పెరోల్ మీద బయటకు వచ్చి చెన్నైలో అడుగుపెట్టిన తరువాత తమిళనాడు మంత్రి సెల్లూర్ కే.
చెన్నై: తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారిపోతున్నాయి. బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు నుంచి చిన్నమ్మ శశికళ పెరోల్ మీద బయటకు వచ్చి చెన్నైలో అడుగుపెట్టిన తరువాత తమిళనాడు మంత్రి సెల్లూర్ కే. రాజు ఆమె భజన చేశారు.
చిన్నమ్మ శశికళ లేకుంటే తమిళనాడులో మా ప్రభుత్వం ఉండేది కాదని సంచలన వ్యాఖ్యలు చేశారు. జయలలితకు విశ్వాసిగా ఉన్న శశికళ అమ్మ మరణించిన తరువాత పార్టీని చెక్కు చెదరనివ్వకుండా ప్రభుత్వాన్ని నిలబెట్టారని మంత్రి సెల్లూరు కే. రాజు చిన్నమ్మను ఆకాశానికి ఎత్తేశారు.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వంపై పరోక్షంగా అసంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి సెల్లూర్ కే. రాజు మదురైలో చిన్నమ్మ భజన చేశారు. తాను తమిళనాడు ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నానని, అందుకే ఎక్కువ మాట్లాడలేకుండా పోతున్నానని మంత్రి సెల్లూర్ కే. రాజు విచారం వ్యక్తం చేశారు.
మంత్రి సెల్లూర్ కే. రాజు వ్యాఖ్యలతో తమిళనాడు ప్రభుత్వంతో ప్రకంపనలు పుట్టించాయి. చివరికి తాను స్లీపర్ సెల్ మంత్రిని కాదని, టీటీవీ దినకరన్ కు మద్దతు ఇవ్వడం లేదని, శశికళ మీద తనకు ఉన్న గౌరవం గురించి చెప్పానని మంత్రి సెల్లూర్ కే. రాజ్ చెప్పడం కొసమెరుపు.
మంత్రి సెల్లూర్ కే. రాజు వ్యాఖ్యలు వ్యక్తిగతమని, ప్రభుత్వానికి సంబంధం లేదని కొంత మంది మంత్రులు అంటున్నారు. మంత్రి సెల్లూర్ కే. రాజ్ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం మౌనంగా ఉన్నారు.