భారత వాతావరణ సూచనలు: పీవోకేపై భారత కీలక ముందడుగు
న్యూఢిల్లీ: పాకిస్థాన్కు గట్టి గుణపాఠం చెప్పేందుకు భారత్ మరో కీలక ముందడుగు వేసింది. పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్(పీవోకే) ప్రాంతాల్లో భారత వాతావరణ విభాగం(ఐఎండీ) ఆధ్వర్యంలో వాతావరణ సూచనలు జారీ చేయనుంది. గతంలో పలు కారణాల వల్ల ఈ ప్రాంతాల్లో ఐఎండీ వాతావరణ సూచనలు నిలిపివేసింది.
పాకిస్థాన్ ఆక్రమణలో ఉన్న గిల్గిత్-బాల్టిస్థాన్, ముజఫరాబాద్లలో మే 5వ తేదీ నుంచి జమ్మూకాశ్మీర్లోని ప్రాంతీయ వాతావరణ విభాగం(ఆర్ఎండీ) ఆధ్వర్యంలో వాతావారణ మార్పులకు సంబంధించిన సూచనలు జారీ చేస్తున్నట్లు ఆర్ఎండీ హెడ్ కుల్ దీప్ శ్రీవాత్సవ వెల్లడించారు.

కాగా, పీవోకేలోని ప్రాంతాలను జమ్మూకాశ్మీర్ సబ్ డివిజన్లో భాగంగా పరిగణించనున్నట్లు ఐఎండీ డైరెక్టర్ జనరల్ మహాపాత్ర కూడా వెల్లడించారు. పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతాల్లో ఎన్నికలు నిర్వహించాలని కొద్ది రోజుల క్రితం పాకిస్థాన్ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దీనిపై భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ.. గిల్గిత్-బాల్టిస్థాన్లు తమ దేశంలో భాగమని, వాటిని ఎప్పటికీ తమ నుంచి వేరుచేయలేరని ఈ సందర్భంగా గుర్తు చేసింది.
భారత విదేశాంగ శాఖ పీవోకేలో ఎలాంటి మార్పులను భారత్ సహించబోదని తేల్చి చెప్పింది. జమ్మూకాశ్మీర్, లడఖ్ తోపాటు గిల్గిత్, బాల్టిస్థాన్ ప్రాంతాలు కూడా చట్టబద్ధంగా భారతదేశంలో అంతర్భాగమేనని మరోసారి గుర్తు చేసింది. పాకిస్థాన్ ప్రభుత్వానికి గానీ, అక్కడి న్యాయవ్యవస్థకు గానీ పాక్ ఆక్రమిత కాశ్మీర్లో జోక్యం చేసుకునే అర్హత, అధికారం లేవని భారత్ తేల్చి చెప్పింది.
ఇదే విషయాన్ని పాక్కు స్పష్టం చేయాలని ప్రధాన ఉద్దేశంతోనే భారత ప్రభుత్వం పాక్ ఆక్రమిత ప్రాంతాల్లో కూడా వాతావరణ సూచనలు చేయాలని ఐఎండీకి సూచించినట్లు తెలుస్తోంది.
-
ఏపీకి కూల్ న్యూస్.. దట్టమైన పొగమంచు.. ఈ జిల్లాలలో వర్షాలు! -
ట్రంప్కు తలనొప్పి.. పుతిన్కు పండగ!: భారత్, చైనాకు రష్యానే దిక్కు! -
భారత్ వృద్ధికి రూ.2 లక్షల కోట్లు..కరణ్ అదానీ కీలక వ్యాఖ్యలు -
దేశవ్యాప్తంగా 300 పాఠశాలలు, 30 ఆసుపత్రులు..భారీ స్థాయిలో అదానీ పెట్టుబడులు -
నాయకత్వాన్ని మలిచింది కుటుంబ విలువలే : కరణ్ అదానీ -
హోటల్ యజమానులకు గుడ్ న్యూస్.. సబ్సిడీలతో సర్కార్ బంపర్ ఆఫర్! -
దేశవ్యాప్తంగా మహిళల ఆర్థిక సాధికారత.. స్వాభిమాన్ విస్తరణతో అదానీ ఫౌండేషన్ కొత్త మిషన్ -
T20 world cup లో తెలివి తక్కువ జట్టు అదే-ఇండియా నాకౌట్ ఛాన్స్ మిస్ ? -
‘బ్లాక్’ దందా: గ్యాస్ సిలిండర్ కావాలంటే రూ. 3,000 నుంచి రూ. 5,000 ఇవ్వాల్సిందే ! -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!!












Click it and Unblock the Notifications