Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్-పాక్ మధ్య కీలక పరిణామం!

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఇండస్ వాటర్స్ ట్రీటీ(IWT) నిలిచిపోయినప్పటికీ భారత్ తన మానవత్వాన్ని చాటుకుంది. భారత్ పాకిస్థాన్‌కు తవి నదిలో సంభవించబోయే వరద గురించి హెచ్చరికలు జారీ చేసింది. ఈ సమాచారాన్ని దౌత్య మార్గాల ద్వారా అందించినట్లు తెలుస్తోంది ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఇరు దేశాల మధ్య జరిగిన ఈ సంభాషణ ఓ కీలక పరిణామంగా పరిగణించబడుతుంది. ఈ హెచ్చరిక తర్వాత పాకిస్థాన్ అధికారులు ప్రభావిత ప్రాంతాలలో హెచ్చరికలు జారీ చేశారు.

వరద హెచ్చరిక, దౌత్యపరమైన సంప్రదింపులు
పాకిస్థాన్‌లోని పత్రికా నివేదికల ప్రకారం, భారత్ తవి నదిలో సంభవించబోయే వరద గురించి పాకిస్థాన్‌ను అప్రమత్తం చేసింది. ఈ సమాచారాన్ని దౌత్య మార్గాల ద్వారా, ముఖ్యంగా ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్ ద్వారా పాకిస్థాన్‌కు అందించినట్లు తెలుస్తోంది. సాధారణంగా ఇలాంటి సమాచారం 1960 నాటి ఇండస్ వాటర్ ట్రీటీ కింద ఏర్పడిన ఇండస్ వాటర్ కమిషనర్ల ద్వారా పంచుకుంటారు. కానీ, ఇప్పుడు ఆ ఒప్పందం నిలిచిపోయింది. అయినప్పటికీ భారత్ ఈ సమాచారాన్ని అందించడం విశేషం.

India Alerts Pakistan of Flooding Despite Strained Ties IWT Suspended After Pahalgam Attack

ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలి సంప్రదింపులు
మే నెలలో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకుంది. అందులో భాగంగానే ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో కుదిరిన ఇండస్ వాటర్ ట్రీటీని నిలిపివేసింది.ఈ చర్యల తర్వాత, ఇరు దేశాల మధ్య జరిగిన తొలి కీలక సంభాషణ ఇదేనని భావిస్తున్నారు. భారత్ నుండి హెచ్చరిక అందిన తర్వాత పాకిస్థాన్ అధికారులు ప్రమాదంలో ఉన్న ప్రాంతాలలో హెచ్చరికలు జారీ చేశారు.

పాకిస్థాన్‌లో భారీ వర్షాలు, వరదలు
పహల్గాం ఉగ్రదాడి తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ 'భారత నదులు భారతదేశానికే' అని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌లో జూన్ 26 నుంచి ఆగస్టు 20 మధ్య కురిసిన భారీ వర్షాల వల్ల దాదాపు 788 మంది మరణించగా.. 1,000 మందికి పైగా గాయపడ్డారు. ఈ విషాదకర పరిస్థితుల్లో పాకిస్థాన్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (NDMA) ఆగస్టు 30 వరకు దేశంలోని చాలా ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తాయని కొత్త హెచ్చరికను జారీ చేసింది.

ఈ పరిస్థితుల్లో ఇండస్ వాటర్ ట్రీటీ నిలిచిపోయినప్పటికీ, మానవతా దృక్పథంతో భారత్ పాకిస్థాన్‌కు సహాయం అందించింది. ఈ చర్య ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడటానికి దోహదపడుతుందా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియదు. ఈ సంఘటన భవిష్యత్తులో ఇరు దేశాల మధ్య పరస్పర సహకారానికి ఒక ఆశాకిరణం కావచ్చు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+