2020 వరకు భారతదేశంలో హ్యాప్పీనెస్ స్కూల్, 'మీ పిల్లల్ని పంపిస్తారా?'
Recommended Video
న్యూఢిల్లీ: భారతదేశంలో హ్యాప్పీనెస్ కోర్స్ రానుందని సేల్ ఫోర్స్ చీఫ్ డిజిటల్ ఎవాంజలిస్ట్ వాలా అప్షర్ ట్వీట్ చేశారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను పొందుపర్చారు. అందులో... సంతోషాన్ని ప్రధానంగా బోధించే ఓ స్కూల్ను భారత్ ప్రారంభిస్తుందని తెలిపారు.
విద్యార్థులు ఇక్కడ తమకు ఇష్టమైన దానిని ఎంచుకునే వీలుటుంది. కర్రికులంలో ఎలాంటి ప్రామాణిక పరీక్షలు ఉండవు. ప్రస్తుత విద్యా వ్యవస్థతో ట్రెడిషనల్ నాలెడ్జ్ పూర్తిగా కనుమరుగవుతుందని హ్యాప్పీనెస్ స్కూల్ ఫౌండర్ అభిప్రాయపడుతున్నారు. అందుకే హ్యాప్పీనెస్ స్కూల్ను తెస్తున్నారు.
India is building a school that focuses on happiness - the most popular course at @Yale is a happiness course https://t.co/REyGhWf5Du pic.twitter.com/SFfTLulWUX
— Vala Afshar (@ValaAfshar) September 1, 2018
క్లాస్ రూంలకు బదులు మెడిటేషన్ గదులు ఉంటాయి. సరికొత్త ఆలోచనలు ఉద్భవించేలా లేబరేటరీలు ఉంటాయి. చాట్ ల్యాబ్స్ ఉంటాయని పేర్కొన్నారు. ఈ స్కూల్ ఫౌండర్.. ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ ఆనందాన్ని దూరం చేస్తోందని అభిప్రాయపడ్డారు.
ఈ స్కూల్లో 400 మందికి చోటు ఉందని పేర్కొన్నారు. ఈ స్కూల్ 2020కి ప్రారంభమవుతుందని తెలిపారు. హ్యాప్పీనెస్ (సంతోషం) కోసం మీ పిల్లలను ఈ స్కూల్కు పంపించాలనుకుంటున్నారా? అని వీడియోలో పేర్కొన్నారు.