భారత్లో మరోసారి విజృంభించనున్న కరోనా మహమ్మారి: శాస్త్రవేత్తల హెచ్చరిక, ఎప్పుడంటే?
న్యూఢిల్లీ: భారత్లో కరోనా మహమ్మారి వ్యాప్తిపై తాజాగా శాస్త్రవేత్తల అంచనా మరింత ఆందోళనకు గురిచేసేదిగా ఉంది. ప్రస్తుతం భారతదేశంలో విజృంభిస్తున్న కరోనావైరస్.. లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత కాస్త స్థిరంగా మారొచ్చని లేదా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు.

ఆ రెండు నెలల్లో మరోసారి..
అయితే, జులై లేదా ఆగస్టు నెలలో తిరిగి విజృంభిస్తుందని శివ్ నాడార్ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ సమిత్ భట్టాచార్య అంచనా వేశారు. ఆ రెండు నెలల్లో ఎప్పుడు, ఏ స్థాయిలో విజృంభిస్తుందనేది.. దేశ ప్రజలు పాటించే భౌతిక దూరం, దూర ప్రయాణాలపై ఆంక్షలు వంటి అంశాలే నిర్ణయిస్తాయని వెల్లడించారు.

చైనా, ఐరాపాల్లోనూ అదే పరిస్థితి..
ప్రస్తుతం వైరస్ వ్యాపిస్తున్న వేగం గతంతో పోలిస్తే బాగా నెమ్మదించిందని ప్రొఫెసర్ భట్టాచార్య తెలిపారు. అలాగే చైనా, ఐరోపా దేశాల్లో కోలుకున్న వారిలో వైరస్ మళ్లీ తిరగబెడుతున్న ఘటనలను గుర్తు చేశారు. కాబట్టి కోలుకున్నవారు పూర్తి రోగనిరోధక శక్తిని సాధిస్తున్నట్లు చెప్పలేమని అన్నారు. వీరి ద్వారానే దేశంలో రెండో విడత వైరస్ వ్యాప్తి ప్రారంభం కావొచ్చని అంచనా వేశారు.

ఆంక్షలను ఎత్తివేస్తే..
కాగా, సమిత్ భట్టాచార్య అంచనాలతో ఐఐఎస్సీ బెంగళూరు ప్రొఫెసర్ రాజేష్ సుందరేశన్ ఏకీభవించారు. దేశంలో ఒకసారి సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాత వైరస్ వ్యాప్తి మరోసారి తీవ్రమయ్యే అవకాశాలున్నాయని తెలిపారు. ఆంక్షల్ని ఎత్తివేసిన తర్వాత చైనా కొంతమేర ఇలాంటి పరిస్థితుల్నే ఎదుర్కొంటోందని చెప్పారు. ముంబైలోని టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చి(టీఐఎఫ్ఆర్)తో కలిసి ఐఐఎస్సీ చేసిన అధ్యయనంలో ఈ విషయాలు తేలాయన్నారు.

అప్రమత్తంగా లేకుంటే..
అంతేగాక, ఐసోలేషన్, హోంక్వారంటైన్, భౌతిక దూరం వంటి నిబంధనలు ఇంకొన్ని నెలలపాటు పాటించాల్సిన అవసరం ఉంటుందని వెల్లడైందన్నారు. ముంబై, బెంగళూరులో చేసిన అధ్యయనాన్ని బట్టి ట్రేస్, ట్రీట్ విధానాన్ని వీలైనంత వేగంగా, ఎక్కువగా చేస్తేనే ప్రజల ప్రాణాలకు ముప్పు తప్పుతుందని తెలిపారు. జులై, ఆగస్టు నెలల్లో ఫ్లూ కూడా విజృంభించే అవకాశం ఉన్న నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. కాగా, దేశంలో శుక్రవారం నాటికి దేశంలో 718 మరణాలు చోటు చేసుకోగా, 23,077 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొదటిసారి మార్చి 25న దేశ వ్యాప్తంగా లాక్డౌన్ విధించగా, మరోసారి మే 3 వరకు పొడిగించిన విషయం తెలిసిందే.
-
కిర్రాక్ ఫీచర్లతో Boat Valour Watch 1R.. ధర ఎంతంటే ?? -
మహారాష్ట్రలోని అండర్ వరల్డ్ డాన్ "దావూద్ ఇబ్రహీం" ఆస్తులు వేలం..! -
కొబ్బరి నీళ్లు.. చెరకు రసం - వేసవిలో ఈ రెండింటిలో ఏది మంచిది..!? -
INSPIRING STORY : నాడు రోజుకు రూ.5 రైతు కూలీ.. నేడు ఆక్స్ఫర్డ్లో "ఏఐ" పై ప్రసంగం..! -
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!?












Click it and Unblock the Notifications